ఆంధ్రప్రదేశ్‌లో కరోనా పాజిటివ్‌ కేసులు

ఆంధ్రప్రదేశ్‌లో కరోనా పాజిటివ్‌ కేసులు

ఆంధ్రప్రదేశ్‌లో కొత్తగా 25 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. దీంతో రాష్ట్రంలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 2,230కి చేరింది. ఈ మేరకు రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ హెల్త్‌ బులిటెన్‌ విడుదల చేసింది. శనివారం ఉదయం 9 గంటల నుంచి ఆదివారం ఉదయం 9 గంటల వరకు 9,880 శాంపిల్స్‌ను పరీక్షించగా 25 మందికి కరోనా పాజిటివ్‌గా నిర్దారణ అయిందని తెలిపింది. కొత్తగా నమోదైన కేసుల్లో చిత్తూరు జిల్లాలో 4, గుంటూరు జిల్లాలో 4, కర్నూలు జిల్లాలో 3, నెల్లూరు జిల్లాలో 1, ప్రకాశం జిల్లాలో 3, శ్రీకాకుళం జిల్లాలో 7, విశాఖపట్నం జిల్లాలో 3 కేసులు ఉన్నాయి.

ఇందులో ప్రకాశంలో ముగ్గరు, చిత్తూరులో ఒక్కరు, కర్నూలులో ఒక్కరు.. తమిళనాడు కోయంబేడు మార్కెట్‌ నుంచి వచ్చివనారు ఉన్నారు. గత 24 గంటల్లో కరోనా నుంచి కోలుకున్న 103 మంది డిశ్చార్జ్ అయ్యారు. దీంతో రాష్ట్రంలో ఇప్పటివరకు కరోనా బారి నుంచి కోలుకున్నవారి సంఖ్య 1,433కి చేరింది. నిన్న కృష్ణా జిల్లాలో ఒకరు మృతిచెందడంతో.. మొత్తం కరోనా మృతుల సంఖ్య 50కి చేరింది. ప్రస్తుతం రాష్ట్రంలో 747 కరోనా యాక్టివ్‌ కేసులు ఉన్నాయి.