ఏపీలో కొత్త కరోనా కేసులు

ఏపీలో కొత్త కరోనా కేసులు

ఏపీలో గడిచిన 24 గంటల్లో 96,153 మంది సాంపిల్స్‌ పరిశీలించగా.. కొత్తగా 5,741 కరోనా కేసులు బయటపడ్డాయి. ఈ కేసులతో మొత్తం కేసుల సంఖ్య 18,20,134కు చేరుకుంది. గత 24 గంటల్లో 53 మరణాలు చోటుచేసుకోగా.. మొత్తంగా మరణాల సంఖ్య 12,052కు చేరింది.

ఇక కరోనా నుంచి ఒక్కరోజులో 10,567 మంది కోలుకోగా.. ఇప్పటివరకు డిశ్చార్జి అయినవారి సంఖ్య 17,32,984గా ఉంది. రాష్ట్రంలో ప్రస్తుతం 75,134 యాక్టివ్‌ కేసులు ఉన్నాయి. ఇక ఇప్పటివరకు రాష్ట్రవ్యాప్తంగా 2,06,34,891 సాంపిల్స్‌ని పరీక్షించినట్లు అధికారులు పేర్కొన్నారు.