Crime: ఘోర ప్రమాదం.. చెరువులో పడ్డ ట్రాక్టర్.. 15 మంది మృతి

Crime: A terrible accident.. Tractor fell into a pond.. 15 people died
Crime: A terrible accident.. Tractor fell into a pond.. 15 people died

ఉత్తర్ప్రదేశ్ లో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. యాత్రికులను తీసుకెళ్తున్న ఒక ట్రాక్టర్ చెరువులో పడిపోయింది. ఈ ఘటనలో దాదాపు 15 మంది మృతి చెందారు. మృతుల్లో ఎనిమిది మంది చిన్నారులున్నారు. ఆ యాత్రికులంతా హరిద్వార్ వెళ్తుండగా కాస్గంజ్లో ఈ ప్రమాదం జరిగినట్లు అధికారులు తెలిపారు.

మాఘ పూర్ణిమను పురస్కరించుకొని గంగా నదిలో పవిత్ర స్నానమాచరించేందుకు వారంతా హరిద్వార్ వెళ్తుండగా.. ట్రాక్టర్ అదుపుతప్పి చెరువులో బోల్తాపడింది. గమనించిన స్థానికులు తక్షణమే స్పందించి కొంతమందిని కాపాడారు. ఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు సహాయక చర్యలు చేపట్టారు. గాయపడిన వారిని ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు రూ.2లక్షల పరిహారం ప్రకటించారు. క్షతగాత్రులకు మెరుగైన చికిత్స అందేలా చూడాలని అధికారులను ఆదేశించారు.