Crime: ఏపీలో.. నల్గొండ జిల్లా ఎస్ఐపై దాడి

Crime: In AP.. Nalgonda district SI attacked
Crime: In AP.. Nalgonda district SI attacked

తెలంగాణ రాష్ట్రం నల్గొండ జిల్లా చెన్నంపేట పోలీస్స్టేషన్కు చెందిన ఎస్ఐ సతీష్తోపాటు వారి సిబ్బందిపై వైయస్ఆర్ జిల్లా మైదుకూరు పురపాలికలోని చిన్నయ్య గారిపల్లెలో గురువారం రాత్రి దాడి జరిగింది. పోలీసు వాహనం పైనా దాడిచేసి ధ్వంసం చేశారు. ఈ ఘటనపై మైదుకూరు పోలీసుస్టేషన్లో కేసు నమోదైంది. పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. చిన్నయ్య గారిపల్లెకు చెందిన ఓబుగాని శివతోపాటు మరికొందరు నల్గొండ జిల్లా చెన్నంపేట పోలీస్స్టేషన్ పరిధిలో గొర్రెలను కొనుగోలు చేశారు. ఈ క్రమంలో రూ.30 లక్షల మేర అప్పు పెట్టారు. ఆ డబ్బులు చెల్లించకపోవడంతో బాధితులు పదిరోజుల కిందట చెన్నంపేట పోలీస్స్టేషన్లో ఫిర్యాదుచేశారు.

సమన్లు జారీ చేసేందుకు బాధితులతో కలిసి ఎస్ఐ సతీష్, ఇద్దరు కానిస్టేబుళ్లు వాహనంలో గురువారం రాత్రి 9.30 గంటల ప్రాం తంలో చిన్నయ్య గారిపల్లె చేరుకున్నారు. అక్కడ గ్రామస్థులకు పోలీసులకు మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. ఈ సమయంలో చిన్నయ్య గారిపల్లెకు చెందిన శివతోపాటు మరో పది మంది.. ఎస్ఐ, ఇతర  సిబ్బంది, వాహన డ్రైవరు తదితరులపై దాడి చేసి గాయపరిచారు. వాహనం అద్దాలను ధ్వంసం చేశారు. బాధిత పోలీసుల ఫిర్యా దు మేరకు హత్యాయత్నం కేసు నమోదు చేసినట్లు మైదుకూరు ఎస్ఐ రాజరాజేశ్వరరెడ్డి తెలిపారు.