Crime: ఓకే కుటుంబంలో తీవ్ర విషాదం.. గంట వ్యవధిలోనే తల్లీకొడుకుల మృతి

మెదక్ జిల్లా హవేలిఘన్పూర్ మండలం కుచన్పల్లిలో విషాదం చోటు చేసుకుంది. గంట వ్యవధిలోనే తల్లీ,కుమారుడు మృతి చెందారు. శనివారం ఉదయం నరసింహ గౌడ్ (36) మృతి చెందగా.. అది తట్టుకోలేక తల్లి లక్ష్మి (57) గుండెపోటుతో ప్రాణాలు కోల్పోయారు. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. నర్సింహగౌడ్ కారు నడుపుతూ జీవనం సాగించేవాడు. ఇవాళ తెల్లవారుజామున ఆయనకు గుండెపోటు రావడంతో కుటుంబ సభ్యులు హుటాహుటిన ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతూ ప్రాణాలు కోల్పోయాడు. విషయం తెలుసుకున్న అతడి తల్లి ఒక్క సారిగా కుప్ప కూలిపోయారు. ఆమె కూడా గుండెపోటుతో మరణించినట్లు వైద్యులు ధ్రువీకరించారు. నర్సింహ గౌడ్ కు భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు.