Crime: రాప్తాడు దాడి కేసులో నిందితుడి అరెస్టు

Crime: Accused arrested in Rapatu attack case
Crime: Accused arrested in Rapatu attack case

అనంతపురం జిల్లా రాప్తాడులో ఆదివారం జరిగిన వైకాపా ‘సిద్ధం’ సభలో ఆంధ్రజ్యోతి ఫొటోగ్రాఫర్ శ్రీకృష్ణపై దాడికి పాల్పడిన మిద్దె ఎర్రిస్వామిని రాప్తాడు పోలీసులు అరెస్టు చేశారు. సెక్షన్ 307 కింద కేసు నమోదు చేశారు. ఉరవకొండ మండలం మరుట్ల కాలనీ-2కు చెందిన ఆయన గతంలో యానిమేటర్గా పనిచేశాడు. మిగతా నిందితులను పట్టుకునేందుకు బృందాలను నియమించారు.

మంగళవారం ఎర్రిస్వామిని ఠాణాకు తీసుకెళ్లే సమయంలో ఉరవకొండ నియోజకవర్గ వైకాపా నాయకులు పోలీసుల వాహనాలను అనుసరించారు. రాత్రి వరకు పోలీస్స్టేషన్ బయట వేచి ఉన్నారు. వారి వాహనాలకు ఉరవకొండ ఎమ్మెల్యే విశ్వేశ్వరరెడ్డి స్టిక్కర్లు ఉండటం గమనార్హం . వీడియోల్లో దాడి ఘటన స్పష్టంగా కనిపిస్తున్నా మిగతావారిని అదుపులోకి తీసుకోవడానికి పోలీసులు జాప్యం చేస్తున్నారని విమర్శలు వస్తున్నాయి.