Crime: కొడుకుతో సహా ఆత్మహత్య చేసుకున్న వృద్ధురాలు

Crime: Tragedy in Telangana.. A couple got married and drank pesticides
Crime: Tragedy in Telangana.. A couple got married and drank pesticides

ఒకే కుటుంబానికి చెందిన తల్లి, కొడుకులు ఆత్మహత్య చేసుకున్నారు. మల్కాజ్ గిరి పటేల్ నగర్ లో మంగళవారం ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. ఈ వయసులో వారికి ఏం కష్టం వచ్చిందోనని స్థానికులు చర్చించుకోవడం కనిపించింది. మల్కాజ్ గిరి పోలీస్ స్టేషన్ ఎస్సై కృష్ణ తెలిపిన వివరాల ప్రకారం.. నిజామాబాద్ కు చెందిన స్వరూప 67 కు కుమారుడు శ్రీకాంత్ 42 ఉన్నాడు ఇతను ఆటో డ్రైవర్ గా పని చేస్తున్నాడు.

ఇతని సోదరుడు రవి నిజామాబాద్ లో ఉంటున్నాడు 15 ఏళ్ల క్రితం భర్తతో విభేదాలు రావడంతో స్వరూప విడిపోయి మల్కాజ్గిరి పటేల్ నగర్ లో నివాసం ఉంటుం.ది అదే విధంగా శ్రీకాంత్ కు పెళ్లి అయినప్పటికీ భార్యతో విభేదాలు రావడంతో విడిపోయి తల్లితో కలిసి ఉంటున్నాడు. తాజాగా గత రెండు రోజులుగా స్వరూప, శ్రీకాంత్ కనిపించకపోవడంతో మంగళవారం ఇంటి యజమాని వారు ఉంటున్న పోర్షన్ కి వెళ్లి కిటికీలోంచి చూడగా స్వరూప ఉరేసుకొని ఉండటం గమనించాడు. పోస్టుమార్టం నిమిత్తం గాంధీ ఆసుపత్రికి తరలించారు.