Crime: చెన్నైలో ఘోర రోడ్డు ప్రమాదం.. నలుగురు మృతి

Crime: Fatal road accident in Chennai.. Four killed
Crime: Fatal road accident in Chennai.. Four killed

చెన్నైలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. తమిళనాడు రాష్ట్రంలోని చెన్నైలో ఇది జరిగినట్లు తెలుస్తోంది. వివరాల్లోకి వెళితే చెన్నై నుండి తిరుచిరాపల్లి జాతీయ రహదారిపై వెళ్తున్న ఒక ప్రైవేట్ బస్సులో నలుగురు విద్యార్థులు ఫుడ్ బోర్టింగ్ చేస్తున్నారు. ఈ క్రమం లో ముందుగా వెళ్తున్న కంటైనర్ లారీ ని బస్సు డ్రైవర్ ఓవర్టేక్ చేస్తుండగా బస్సులో నుండి నలుగురు విద్యార్థులు అదుపు తప్పి కింద పడిపోయారు.

ఈ ప్రమాదంలో కంటైనర్ లారీ చక్రాల కింద పడిపోయి ఆ నలుగురు అక్కడికక్కడే చనిపోయారు. స్థానికుల సమాచారం మేరకు ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు ప్రమాదం జరిగిన ప్రాంతాన్ని పరిశీలించారు మృతదేహాలని పోస్ట్ మార్టం నిమిత్తం స్థానిక ప్రభుత్వాసుపత్రికి తీసుకెళ్లారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.