Crime: MP కారును ఢీకొట్టి విద్యార్థి దుర్మరణం

Crime: Student dies after hitting MP's car
Crime: Student dies after hitting MP's car

తిరుపతి జిల్లా తిరుచానూరు సమీపంలోని దామినేడు జాతీయ రహదారిపై జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇంజినీరింగ్ విద్యార్థి దుర్మరణం చెందారు. ఆదివారం గాజులమండ్యం నుంచి తిరుపతి వైపు ఇన్నోవా కారు వస్తుండగా, దాని డ్రైవర్ దామినేడు సమీపంలో హఠాత్తుగా బ్రేక్ వేశారు. కారు వెనుక స్నేహితులతో ద్విచక్ర వాహనంపై వస్తున్న జీవకోనకు చెందిన ఇంజినీరింగ్ విద్యార్థి సందీప్ దాన్ని వేగంగా ఢీకొన్నారు.

ద్విచక్ర వాహనం హ్యాండిల్ ఆయన మెడకు గుచ్చుకోవడంలో అక్కడికక్కడే మృతి చెందారు. మిగిలిన ఇద్దరూ తీవ్రంగా గాయపడ్డారు. కారును నిర్లక్ష్యంగా నడపడంతోనే యువకుడు మృతిచెందినట్లు ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. ప్రమాదానికి గురైన కారుపై మెంబర్ ఆఫ్ పార్లమెంట్ అని, తితిదేకు చెందిన లోగో ఉన్నాయి. పోలీసులు ప్రమాద వివరాలను గోప్యంగా ఉంచారు.