ఎనిమిదేళ్ళ తర్వాత మెగాఫోన్ పడుతున్న దర్శకుడు !

director vn aditya new movie

మనసంతా నువ్వే ద్వారా తొలి సినిమాతోనే సంచలన విజయం నమోదు చేసుకుని వరుస అవకాశాలతో బిజీ అయిపోయిన దర్శకుడు వి.ఎన్.ఆదిత్య. అయితే తర్వాత చాలా అవాకశాలు వచ్చినా హిట్స్ లేక పోవడంతో ఫేడౌట్ అయిపోయాడు. ఈ మధ్య అసలు విఎన్.ఆదిత్య సినిమాలు చేసిన దాఖలాలు కూడా లేవు. అలంటి దర్శకుడు మళ్ళీ సినిమా చేస్తున్నాడని అంటున్నారు, అది కూడా నాని చేసిన ఒక సినిమా వలన…అదేంటి అలా ? అనుకుంటున్నారా ? అసలు అదేంటంటే ఈ మధ్య నాని నటించిన జెర్సీ సినిమా హిట్ టాక్ తెచ్చుకున్న సంగతి తెలిసిందే. అందులో నాని కొడుకు నానితో నువ్వు క్రికెట్ ఆడితే బాగుంటుంది నాన్నా అడచ్చు కదా, అని అడుగుతాడు, దీంతో నాని ఆట మొదలు పెడతాడు. ఇప్పుడు ఇదే సీన్ ఆదిత్య జీవితంలో కూడా జరిగిందట, అది కూడా జెర్సీ సినిమాని ఆయన కొడుకు చూశాక. తన కొడుకు అడిగినందుకు అయినా సినిమా తీస్తానని ఆయన చెబుతున్నారు.  ఆదిత్య చివరిగా తీసిన సినిమా సురేష్ ప్రొడక్షన్స్ నుండి వచ్చిన ముగ్గురు. ముగ్గురు హీరోలు, హీరోయిన్స్ తో తీసిన సినిమా అస్సలు ఆడలేదు, దీంతో సైలెంట్ అయ్యారు ఆయన. ఈ సినిమా తర్వాత ఎనిమిదేళ్ల పాటు గ్యాప్ తీసుకున్న ఆయన  గీతా ఆర్ట్స్ 2 బ్యానర్ లో సుమంత్ ఆశ్వన్ హీరోగా ఓ ప్రాజెక్ట్ చేస్తునట్టు చెబుతున్నారు. సుమంత్ అశ్విన్ తండ్రి ఎంఎస్ రాజు బ్యానర్ లోనే విఎన్ ఆదిత్య రెండు సూపర్ హిట్ సినిమాలు చేశారు. తనకి చేయూతనిచ్చిన నిర్మాత కొడుక్కి గుర్తుండిపోయే సినిమా ఒకటి చేయాలని ఆయన భావిస్తున్నారట.