మీ టూ: ఈ సారి అమలాపాల్‌ వంతు!

బాలీవుడ్‌ నటి తనూశ్రీ దత్తా ప్రముఖ నటుడు నానా పటేకర్‌పై చేసిన లైంగిక ఆరోపణలతో మీ టూ ఉద్యమం ఇండియాలో వేడెక్కింది. బాలీవుడ్‌లో పలువురు తమపై జరిగిన లైంగిక దాడులను బహిరంగ పర్చారు. బాలీవుడ్‌లో మీ టూ వేడి తగ్గకముందే అని భాషల్లోని సినీ పరిశ్రమల్లో ఇది హాట్‌గా మారిపోయింది. వివిధ భాషల్లో సినీ పరిశ్రమల్లో పనిచేసే మహిళలు తమకు ఎదురైన చేదు అనుభవాలను ఒక్కొక్కరుగా బయట పెడుతున్నారు. తాజాగా స్టార్‌ హీరోయిన్‌ అమలాపాల్‌ కూడా మీ టూ ఉద్యమంలో పాల్గోంది. అంతేకాకుండా ఒక దర్శకుడి నిజస్వరూపాన్ని బయట పెట్టింది. లేడి దర్శకురాలు లీనా తనను లైంగికంగా వేధించాడని దర్శకుడు సుశీ గణేశన్‌పై తీవ్ర ఆరోపణలు చేసింది.

Director Susi Ganeshan and actress Amala Paul

తాజాగా మీ టూలో భాగంగా తను లేడి దర్శకురాలు లీనాకు మద్దతుగా ఉంటాను అని, దర్శకుడు సుశీ గణేశన్‌తో నేను ఒక సినిమా చేశాను, షూటింగ్‌ సందర్భంలో ఆయన డబుల్‌ మీనింగ్‌ మాటలు మాట్లాడుతూ ఆడవారిని తాకడానికి ప్రయత్నిస్తాడు అంతేకాకుండా లైంగికంగా ప్రేరేపించడానికి ప్రయత్నిస్తాడు. నుశీ తన భార్య ముందే నన్ను వేధించాడు ఇదంతా ఆమె నవ్వుతూ ఎంజాయ్‌ చేసింది. తన భర్త తన కళ్ల ముందే వేరే అమ్మాయిని వేధిస్తుంటే నవ్వుతూ ఎంజాయ్‌ చేస్తున్న ఆమెను చూసి నేను షాక్‌ అయ్యాను అంటూ అమలాపాల్‌ సదరు దర్శకుడిపై లైంగిక ఆరోపణలు చేసింది. ఆరోపణలపై వెంటనే ఆ ఇద్దరు తనకు ఫోన్‌ చేసి కించపరిచేలా మాట్లాడారని అమలా చెప్పుకొచ్చింది.