విరూపాక్ష కోసం ముందుగా అనుకున్న హీరోయిన్ ఎవరో తెలుసా..? ఆమె హీరోని డామినేట్ చేస్తుందని తీసేసారట..!

Sai Dharam Tej
Sai Dharam Tej

సుప్రీమ్ హీరో సాయి ధరమ్ తేజ్ గురించి ప్రత్యేకంగా పరిచయం చేయనవసరం లేదు. పిల్లా నువ్వు లేని జీవితం సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన తేజ్… వరుస సినిమాలు చేసుకుంటూ తెలుగు ప్రేక్షకులలో తనకంటూ ఒక సెపరేట్ ఫ్యాన్ ఫాలోయింగ్ క్రియేట్ చేసుకున్నాడు.

ఇక బైక్ యాక్సిడెంట్ తర్వాత సాయి ధరమ్ తేజ్ నటించిన విరూపాక్ష చిత్రం బాక్స్ ఆఫీస్ వద్ద అదిరిపోయే కలెక్షన్స్ ని కాబట్టి సూపర్ హిట్ సక్సెస్ ని అందుకుంది. ఈ సినిమాను దర్శకుడు కార్తీక్ దండు సస్పెన్స్ హారర్ థ్రిల్లర్ గా తెరకు ఎక్కించాడు.

ఇక ఈ సినిమాలో సంయుక్త మీనన్ యాక్టింగ్ ఓ రేంజ్ లో ప్రేక్షకులను ఆకట్టుకుంది. తన యాక్టింగ్ తో థియేటర్లోని ప్రేక్షకులను సంయుక్త బాగా ఆకట్టుకుంది. హారర్ కథాంశంతో వచ్చిన విరూపాక్ష చిత్రం దాదాపు 200 కోట్లు వరకు వసూల్ రాబట్టింది.

అయితే ముందుగా ఈ సినిమాలో హీరోయిన్ గా సాయి పల్లవిని హీరోయిన్గా తీసుకోవాలని భావించారట మూవీ మేకర్స్. సాయి పల్లవి ప్రధాన పాత్రల్లో అద్భుతంగా నటించి సినిమా విజయంలో కీలక పాత్ర పోషించింది. అయితే సాయితేజ్ అదే సమయంలో ప్రమాదం నుంచి కోలుకుంటున్నాడు.

వీరిద్దరూ కలసి నటిస్తే సాయి పల్లవి సాయిధర్మతేజ్ ని డామినేట్ చేసే ఛాన్స్ ఉందని మేకర్స్ భావించారట. అందుకే ఈ సినిమా నుంచి సాయి పల్లవిని తొలగించాల్సి వచ్చిందని సమాచారం వినిపిస్తుంది .