మద్యం మత్తులో ఇంతటి దారుణానికి పాల్పడ్డాడా??

హైదరాబాద్ లో ఘోరమైన ఘటన వెలుగు చూసింది. మద్యం మత్తులో భార్యను కొట్టి చంపిన ఘటన పెను దుమారం రేపుతోంది. తాజాగా తాగిన మత్తులో ఓ భర్త కట్టుకున్న భర్యనే చంపేశాడు. బాలింత అని కూడా చూడకుండా ఆమెను తీవ్రంగా కొట్టాడు. భర్త కొట్టిన దెబ్బలను తట్టుకోలేక ఆమె ప్రాణాలు విడిచింది.

అసలేం జరిగింది అంటే.. హైదరాబాద్‌లోని బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ ఘటన చోటు చేసుకుంది. అయితే బంజారాహిల్స్‌ రోడ్డు నెం.2లోని ఇందిరానగర్‌లో నివసించే రుడావత్‌ అనిల్‌ వికారాబాద్‌ జిల్లాకు చెందిన అనితను ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. వీరికి నలుగురు పిల్లలు. సినిమా సెట్టింగులు, వేదికల అలంకరణ సామగ్రి అద్దెకిస్తూ జీవిస్తుంటాడు. అయితే వీరికి ఇద్దరు కుమార్తెలు, ఒక కుమారుడు కలిగారు. అయితే నెలన్నర క్రితం మరో బాబు పుట్టాడు. కొన్నేళ్లుగా అనిల్‌ కట్నం కోసం వేధిస్తుండడంతో రెండేళ్ల క్రితం భార్య పోలీసులకు కూడా  ఫిర్యాదు చేసింది.

కాగా తాజాగా రాత్రి బాగా మద్యం సేవించి భార్యతో గొడవకు దిగాడు. బాలింత అనీ కూడా చూడకుండా మద్యం మత్తులో హీటర్‌తో భార్యను విపరీతంగా కొట్టాడు. ‘వద్దు నాన్నా… అమ్మని కొట్టవద్దని’ అని కుమార్తె కాళ్లా వేళ్లా పడ్డా ఏమాత్రం కనికరించలేదు. భర్త దెబ్బలకు తట్టుకోలేక భార్య మృతిచెందగానే అక్కడ నుంచి భర్త పరారయ్యాడు. కాగా విషయం తెలుసుకున్న బంజారాహిల్స్‌ పోలీసులు మృతదేహాన్ని ఉస్మానియా ఆసుపత్రికి తరలించి కేసు నమోదు చేశారు. నిందితుడి కోసం గాలిస్తున్నారు. నెలన్నర బాబు తల్లిపాల కోసం గుక్కపెట్టి ఏడుస్తుండటం.. మిగిలిన ముగ్గురు పిల్లలు తల్లి చనిపోవడంతో పాపం వారికి ఏం చేయాలో తెలయిక అయోమయంలో పడ్డారు. వీరి పరిస్థితిని చూసిన స్థానికులు తీవ్రమైన ఆవేదనకు లోనౌతున్నారు.