Election Updates: ఇద్దరు వైసీపీ ఎమ్మెల్సీలపై అనర్హత వేటు

Election Updates: Disqualification of two YCP MLCs
Election Updates: Disqualification of two YCP MLCs

ఎన్నికలకు సమయం ముంచుకొస్తున్న వేళ వైసీపీ నుంచి బయటకు వస్తున్న నేతల సంఖ్య పెరుగుతోంది. ఇప్పటికే పలువురు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు వైసీపీని వీడారు. ఈ నేపథ్యంలో పార్టీ ఫిరాయించిన ఇద్దరు వైసీపీ ఎమ్మెల్సీలపై శాసనమండలి చైర్మన్ మోషేన్ రాజు అనర్హత వేటు వేశారు.

సి. రామచంద్రయ్య, వంశీకృష్ణ యాదవ్ లను సస్పెండ్ చేస్తూ చైర్మన్ నిర్ణయం తీసుకున్నారు. అయితే వంశీకృష్ణ జనసేనలోకి, రామచంద్రయ్య టీడీపీలో జాయిన్ అయ్యారు. దీంతో పార్టీ ఫిరాయింపుల కింద చర్యలు తీసుకోవాలని మండల కార్యదర్శికి వైసీపీ నేత మండలిలో చీఫ్ విప్ మేరిగ మురళీధర్, ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డిలు ఫిర్యాదు చేశారు. ఈ నేపధ్యంలో వీరిపై చర్యలు తీసుకున్నారు.