Election Updates: ఇవాళ సీఎం జగన్ సమక్షంలో వైసీపీలో చేరనున్న ముద్రగడ

Election Updates: Mudragada will join YCP today in the presence of CM Jagan
Election Updates: Mudragada will join YCP today in the presence of CM Jagan

ఇవాళ వైసీపీలో చేరనున్నాడు ముద్రగడ పద్మనాభం. నేడు సీఎం జగన్ సమక్షంలో వైసీపీలో చేరనున్నారు ముద్రగడ పద్మనాభం. ఈ మేరకు కిర్లంపూడి నుంచి తాడేపల్లి ముద్రగడ పద్మనాభం వచ్చారు. ఇక సీఎం జగన్‌ సమక్షంలో కుమారుడు గిరితో వైసీపీలో చేరనున్నారు ముద్రగడ పద్మనాభం. అయితే, ముద్రగడ పద్మనాభంను పిఠాపురం నుంచి బరిలో దింపనున్న సీఎం జగన్ మోహన్ రెడ్డి.

కాగా, ఇటీవలే ఏపీ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో ప్రజలకు ముద్రగడ పద్మనాభం బహిరంగ లేఖ రాశారు. వైసీపీ లోకి వెళ్లాలని మీ ఆశీస్సులతో నిర్ణయం తీసుకున్నానని ఈ లేఖలో వివరించారు.జగన్ ను ముఖ్యమంత్రి పీఠం పై కూర్చోపెట్టడానికి ఎలాంటి కోరికలు లేకుండా పని చేయాలని నిర్ణయం తీసుకున్నానని పేర్కొన్నారు. అభివృద్ధిని వారితో చేయించాలని ఆశతో ఉన్నాను…మీ బిడ్డ ను అయిన నేను ఎప్పుడు తప్పు చేయలేదని వెల్లడించారు.