Election Updates: పవన్‌ కల్యాణ్‌కు తీవ్ర జ్వరం, హుటాహుటినా హైదరాబాద్‌కు తరలింపు

Election Updates: Pawan Kalyan has high fever and has been shifted to Hyderabad
Election Updates: Pawan Kalyan has high fever and has been shifted to Hyderabad

అసెంబ్లీ ఎన్నికలు దగ్గర పడుతుండడంతో పోటీ చేస్తున్న నియోజకవర్గంలో గెలుపే లక్ష్యంగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అడుగులు వేస్తున్నారు. ఇందులో భాగంగా విస్తృతంగా ప్రచారంలో పాల్గొంటున్న జనసేన అధినేత పవన్ కల్యాణ్‌ 2రోజుల నుంచి తీవ్ర జ్వరంతో ఇబ్బంది పడుతున్నారు. ఇవాళ జ్వరం ఎక్కువ అవ్వడంతో ఆయనను తన సహాయకులు హుటాహుటినా హైదరాబాద్‌కు తరలించారు. అయితే, నిన్న, ఇవాళ పవన్‌ కళ్యాణ్ ఆయన పోటీ చేయబోతున్న పిఠాపురంలో ప్రచారంలో పాల్గొన్నారు. ఉదయం ఆయన శ్రీపాద వల్లభుడిని దర్శించుకుని మధ్యాహ్నం తెలుగుదేశం పార్టీ మాజీ ఎమ్మెల్యే వర్మ, టీడీపీ, బీజేపీ నాయకులతో హోటల్‌లో భేటీ అయ్యారు.

అనంతరం గొల్లప్రోలు నుంచి హెలికాప్టర్‌ ద్వారా రాజమండ్రికి చేరుకున్నారు. అక్కడి నుంచి ప్రత్యేక విమానంలో హైదరాబాద్‌కు బయలుదేరనున్నారు. రేపు ఉదయం పీఠాపురానికి చేరుకుని, రెండు రోజుల పాటు నియోజకవర్గ వ్యాప్తంగా పవన్ ప్రచారంలో పాల్గొంటారని తెలుస్తోంది.