Election Updates: నేడు ధర్మపురిలో సీఎం కేసీఆర్ బహిరంగ సభ

Election Updates: Is CM KCR taking another new scheme..?
Election Updates: Is CM KCR taking another new scheme..?

ధర్మపురిలో నేడు సీఎం కేసీఆర్ బహిరంగ సభ జరగనుంది. 2PMకి ప్రత్యేక హెలికాప్టర్ లో కేసీఆర్ ధర్మపురి చేరుకుంటారు. ఇప్పటికే మంత్రి కొప్పుల ఈశ్వర్ దగ్గర ఉండి ఏర్పాట్లు పూర్తి చేయించారు. నియోజకవర్గ పరిధి 6 మండలాల నుంచి 50 వేల మందిని సభకు తరలించేలా నేతలు ఏర్పాట్లు చేస్తున్నారు. సభా ప్రాంగణం వద్ద భారీ బందోబస్తు ఏర్పాటు చేసినట్లు ఎస్పీ సన్ ప్రీత్ సింగ్ తెలిపారు. హెలిప్యాడ్, విఐపి పార్కింగ్ వద్ద నిగా పెట్టారు.

అలాగే.. ఇవాళ నిర్మల్‌ జిల్లాలో జరిగే బహిరంగ సభల్లో కూడా సీఎం కేసీఆర్‌ పాల్గొంటారు. ఈ మేరకు అన్ని ఏర్పాట్లు చేశారు బీఆర్‌ఎస్‌ నేతలు. ఇక అటు నిన్న ఖమ్మం జిల్లా సత్తుపల్లి నియోజకవర్గంలో నిర్వహించిన ప్రజా ఆశీర్వాద సభలో సీఎం కేసీఆర్‌ ప్రసంగించారు. ఆరు నూరైనా తెలంగాణలో గెలువబోయేది బీఆర్‌ఎస్‌ పార్టీయేనని ఈ సందర్భంగా సీఎం కేసీఆర్‌ తెగేసి చెప్పారు. తెలంగాణ రాష్ట్రంలో బీఆర్‌ఎస్‌ పార్టీ గెలువకుండా ఎవడూ ఆపలేడన్నారు. బీఆర్‌ఎస్‌ గెలుపుని ఆపడం ఎవని తాత, జేజమ్మ వశం కాదని చెప్పారు.