Election Updates: కాంగ్రెస్‌కి జైకొట్టిన నర్సంపేట మాజీ ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్‌రెడ్డి

Election Updates: Former Narsampeta MLA Revuri Prakash Reddy won for Congress
Election Updates: Former Narsampeta MLA Revuri Prakash Reddy won for Congress

మాజీ ఎమ్మెల్యే, బీజేపీ నేత రేవూరి ప్రకాష్ రెడ్డి త్వరలోనే కాంగ్రెస్ లో చేరనున్నారు. నిన్న వరంగల్లో ఆయనతో టిపిసిసి చీఫ్ రేవంత్ రెడ్డి, తుమ్మల, పొంగులేటి భేటీ అయ్యారు. పార్టీలో చేరాలని ఆహ్వానించగా అందుకు రేవూరి అంగీకరించారు. ఢిల్లీలో ఆయన హస్తం కండువా కప్పుకొనున్నారు. ఎన్నికల్లో పరకాల నుంచి పోటీచేసే అవకాశం ఉంది.

ఇది ఇలా ఉండగా సీఎం కేసీఆర్‌ షాక్‌… మాజీ మంత్రి, నిజామాబాద్ జిల్లాకు చెందిన బీఆర్ఎస్ నేత మండవ వెంకటేశ్వరరావు కాంగ్రెస్ లో చేరనున్నట్లు సమాచారం. ఇవాళ లేదా రేపు రాహుల్ గాంధీ సమక్షంలో ఆయన హస్తం పార్టీ కండువా కప్పుకొనున్నట్లు ప్రచారం జరుగుతోంది. మండవ కాంగ్రెస్ లో చేరితే ఆయనకు నిజామాబాద్ రూరల్ టికెట్ ఇవ్వాలని ఆ పార్టీ అధిష్టానం భావిస్తోందట.ఇక అటు బీఆర్‌ఎస్‌కు మాజీ ఎమ్మెల్సీ లక్ష్మీనారాయణ రాజీనామా చేశారు. కాంగ్రెస్‌లో చేరనున్నారు బాలసాని లక్ష్మీనారాయణ.