Election Updates: ఇవాళ కారు ఎక్కనున్న పొన్నాల లక్ష్మయ్య

Election Updates: Ponnala Lakshmaiah who will board the car today
Election Updates: Ponnala Lakshmaiah who will board the car today

మాజీ పీసీసీ అధ్యక్షులు పొన్నాల లక్ష్మయ్య ఇవాళ భారత రాష్ట్ర సమితి పార్టీలో చేరనున్నారు. గులాబీ బాస్ కల్వకుంట్ల చంద్రశేఖర రావు సమక్షంలో పొన్నాల లక్ష్మయ్య గులాబీ కండువా కప్పుకొని ఉన్నారు . జనగామ వేదికగా ఈ చేరిక జరగనుంది.

సీఎం కేసీఆర్ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఇవాళ జనగామ జిల్లాకు వెళ్ళనున్నారు. ఈ సందర్భంగా బహిరంగ సభలో ప్రసంగించనున్నారు సీఎం కేసీఆర్. ఈ తరుణంలోనే సీఎం కేసీఆర్ సమక్షంలో మాజీ పిసిసి అధ్యక్షులు పొన్నాల లక్ష్మయ్య చేరనున్నారు.

గత మూడు రోజుల కిందట కాంగ్రెస్ పార్టీకి పొన్నాల లక్ష్మయ్య రాజీనామా చేశారు. జనగామ కాంగ్రెస్ పార్టీ టికెట్ తనకు ఇవ్వలేదని ఆవేదన వ్యక్తం చేస్తూ… రేవంత్ రెడ్డిని ఉద్దేశించి పొన్నాల లక్ష్మయ్య కీలక వ్యాఖ్యలు చేశారు. తదనంతరం భారత రాష్ట్ర సమితి పార్టీలో చేరేందుకు పొన్నాల లక్ష్మయ్య సిద్ధమయ్యారు.