Election Updates: ఖమ్మంలో కాంగ్రెస్ కీలక నేతల సీట్లు ఓ కొలిక్కి.

Election Updates: The seats of key Congress leaders in Khammam are a matter of course.
Election Updates: The seats of key Congress leaders in Khammam are a matter of course.

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో రాజకీయాలు ఇప్పుడు రసవత్తరంగా మారాయి. ముఖ్యంగా ఇప్పటికే బీఆర్ఎస్ నలుగురు, ఐదుగురు అభ్యర్థులు మినహా మిగతా వారిని ప్రకటించలేదు. కాంగ్రెస్ మాత్రం ఇంకా అభ్యర్థుల కసరత్తులోనే కనిపిస్తోంది. కొంత మందిని కాంగ్రెస్ తొలి జాబితా రేపు ప్రకటించే అవకాశం ఉంది.

ఖమ్మంలో కాంగ్రెస్ కీలక నేతల సీట్లు మాత్రం ఓ కొలిక్కి వచ్చాయి. పాలేరు నుంచి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి పోటీ చేయనుండగా, ఖమ్మం నుంచి తుమ్మల నాగేశ్వరరావు పోటీ చేయనున్నారు. రాహుల్ గాంధీ సమక్షంలో ఈ సీట్లు ఖరారయ్యాయి. ఇవాళ మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వర్ రావు కాంగ్రెస్ అగ్రనాయకుడు రాహుల్ గాంధీతో భేటీ అయ్యారు. సుమారు అరగంట పాటు రాహుల్ గాంధీతో భేటీ అయ్యారు. రాష్ట్రంలో తాజా పరిస్థితుల గురించి వివరించినట్టు తెలుస్తోంది. ఖమ్మం జిల్లాలో పరిస్థితులు, రాజకీయ వ్యూహంపై కూడా చర్చించారు. తుమ్మల, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి కూడా రాహుల్ గాంధీని కలిశారు. ఈ ఇద్దరూ నేతలకు రాహుల్ గాంధీని కలిసిన తరువాత ఈ సీట్లపై స్పష్టమైన హామీ వచ్చిందని పార్టీవర్గాలు పేర్కొంటున్నాయి.Electt