వచ్చే మూడేళ్లలో విద్యుత్ డిమాండ్ పెరుగుతుంది

telangana cm revanth reddy
telangana cm revanth reddy

భవిష్యత్తులో హైదరాబాద్ డేటా సెంటర్ల హబ్‌గా మారబోతుందని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి తెలిపారు. హైదరాబాద్‌లో డేటా సిటీ ఏర్పాటు చేయబోతున్నామని ప్రకటించారు. ఇవాళ హైదరాబాద్‌లోని కమాండ్ కంట్రోల్ సెంటర్‌లో విద్యుత్ శాఖ అధికారులతో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా అధికారులకు కీలక ఆదేశాలు జారీ చేశారు. వచ్చే మూడేళ్లలో ప్రభుత్వం తీసుకువచ్చే ప్రతిష్టాత్మక ప్రాజెక్టుల వల్ల విద్యుత్ డిమాండ్ పెరుగుతుందని అన్నారు. వచ్చే మూడేళ్లు విద్యుత్ అవసరాల కోసం ప్రణాళిక సిద్ధం చేసుకోవాలని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి సూచించారు.