పదకొండేళ్ల చిన్నారిపై రేప్.. తీవ్ర రక్తస్రావంతో బాలిక…

ఓవైపు కరోనా మహమ్మారి విజృంభణ. మరోవైపు అసాంఘిక కార్యకలాపాలు. అసలు ఈ సమాజానికి ఏమైంది అంటూ పెద్దమనుషులు తీవ్ర ఆందోళనకు లోనౌతున్నారు. తాజాగా ప్రకాశం జిల్లాలో కామాంధుడు రెచ్చిపోయాడు. ఒంటరిగా ఉన్న బాలికను దారుణంగా రేప్ చేశాడు.

అయితే అసలు ఏం జరిగింది అంటే… ఇంట్లో ఒంటరిగా ఉన్న బాలికపై కన్నేసిన కామాంధుడు దారుణానికి పాల్పడ్డాడు. అభంశుభం తెలియని బాలికపై అత్యాచారం చేశాడు. ఎవరికైనా చెప్తే… చంపేస్తానని బెదిరించాడు. దాంతో ఆ బాలిక భయపడిపోయింది. అయితే రక్తంతో తడిసిపోయిన బాలిక బట్టలు గమనించిన తల్లిదండ్రులు ఆరా తీయడంతో ఘోరం వెలుగుచూసింది.

కాగా ప్రకాశం జిల్లా దర్శి మండలంలోని ఓ గ్రామంలో ఈ ఘటన చోటుచేసుకుంది. పదకొండేళ్ల బాలికను దారుణంగా రేప్ చేశాడు ఓ దుర్మార్గుడు. తల్లిదండ్రులు వ్యవసాయ పనులకు వెళ్లడంతో ఇంట్లో ఒంటరిగా ఉన్న బాలికపై అదే గ్రామానికి చెందిన 50 ఏళ్ల వ్యక్తి దారుణానికి పాల్పడ్డాడు. ఇంటి సమీపంలో ఆడుకుంటున్న బాలికను ఇంట్లోకి తీసుకెళ్లి రేప్ చేశాడు. తర్వాత లైంగిక దాడికి గురైన బాలిక బాత్రూమ్‌కి వెళ్లొచ్చి ఏడుస్తుండడంతో.. ఆమె బట్టలపై రక్తపు మరకలు గమనించిన తల్లి నెమ్మదిగా ఆరా తీసింది. దీంతో అసలు విషయం బయటపడింది. వెంటనే బాలిక తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నారు.