దృష్టి లోపమున్న బ్యాంక్ మేనేజర్ పై దుండగుడు అఘాయిత్యం

లాక్‌డౌన్ వేళ ప్రపంచమంతా తల్లడిల్ల పోతుంటే మానవమృగాలు మాత్రం ఏం పట్టనట్లు వ్యవహరిస్తున్నాయి. తాజాగా లాక్ డౌన్ ఓ మహిళా బ్యాంక్ మేనేజర్ పాలిట శాపంగా మారింది. భర్త వేరే ప్రాంతంలో చిక్కుకుపోవడంతో ఒంటరిగా ఉంటున్న ఆమెపై అత్యాచారం జరిగింది. ఉన్నత వర్గాలు నివాసం ఉంటున్న ప్రాంతంలో రేప్ జరగడం ప్రస్తుతం కలకలం రేపుతోంది.

అయితే ఇంట్లో ఒంటరిగా ఉన్న మహిళా బ్యాంక్ మేనేజర్‌పై అఘాయిత్యానికి ఒడిగట్టాడు ఓ దుర్మార్గుడు. బాల్కనీ నుంచి ఇంట్లోకి ప్రవేశించి నిద్రిస్తున్న మేనేజర్‌ని దారుణంగా రేప్ చేశాడు. ఆమె భర్త ఇంట్లో లేని సమయం చూసి దుండగుడు అత్యాచారానికి పాల్పడ్డాడు. ఈ దారుణమైన ఘటన మధ్యప్రదేశ్ రాజధాని భోపాల్‌లో చోటు చేసుకుంది.

కాగా మహిళా బ్యాంక్ మేనేజర్‌ని దారుణంగా రేప్ చేసిన ఘటన భోపాల్‌లోని షాపుర్ ప్రాంతంలో జరిగింది. తెల్లవారుజామున ఇంట్లోకి చొరబడిన దుండగుడు మేనేజర్‌పై అత్యాచారానికి పాల్పడ్డాడు. లాక్‌డౌన్ కారణంగా ఆమె భర్త రాజస్థాన్‌లో చిక్కుకుపోవడంతో ఆమె ఫ్లాట్‌లో ఒంటరిగా ఉంటుంది. ఇదే అదనుగా భావించిన దుండగుడు ఆమెపై అత్యాచారానికి తెగబడ్డాడు. కాగ ఇంటి బాల్కనీ నుంచి ఇంట్లోకి ప్రవేశించిన దుండగుడు.. బెడ్రూమ్‌లో నిద్రిస్తున్న మేనేజర్‌ని రేప్ చేశాడు. భోపాల్‌లోని ఉన్నత వర్గాలు నివాసం ఉండే షాపురా ప్రాంతంలో అత్యాచారం జరగడం కలకలం రేపుతోంది. ఆమెకి దృష్టి లోపం ఉండడం.. తెల్లవారుజాము సమయం కావడంతో నిందితుడిని గుర్తించలేక పోయినట్లు తెలుస్తోంది. పోలీసులు రేప్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. నిందితుడి కోసం పోలీసులు తీవ్రంగా గాలిస్తున్నారు.