గోల్డ్ షాపులో దొంగతనం.. టీవీ పట్టుకెళ్లడంపై అంతా షాక్…

పంజాబ్ లోని పటియాలాలో ఓ షాపులో దొంగలు పడ్డారు. విపరీతంగా రద్దీ ఉండే ఈ ప్రాంతంలో ఓ గోల్డ్ షాపులో దొంగతనం జరిగింది. విషయం తెలుసుకుని షాపు వద్దకు వచ్చిన పోలీసులు దొంగిలించిన వస్తువులను విని షాక్ కు గురయ్యారు.

అయితే బంగారం షాపులో దొంగతనం జరిగిందని తెలియగానే పోలీసులు ఘటనా స్థలికి చేరుకొని ఓనర్ ని విచారించారు. అప్పుడు ఆయన మాటలు విని ఆశ్చర్యపోయారు. షాపు నిండా నగలు పెట్టుకొని దొంగ ఏం పట్టుకెళ్లాడో తెలిసి షాక్‌కి గురయ్యారు. కళ్ల ముందు విలువైన ఆభరణాలు అన్ని ఉండగా.. అవి విడిచిపెట్టి టీవీ చోరీ చేయడం సర్వత్రా ఆసక్తిని రేపుతోంది. కాగా పటియాలాలోని పూరి మార్కెట్ ప్రాంతంలో ఉన్న ఓ ప్రముఖ గోల్డ్ షాపులో ఈ చోరీ జరిగింది. షాపు తెరిచి చూసిన యజమాని దుకాణంలో దొంగతనం జరిగిందంటూ పోలీసులకు సమాచారం అందించాడు.

అయితే వెంటనే పోలీసులు దుకాణం వద్దకు వచ్చి విచారణ జరిపారు. చోరీకి గురైన వస్తువుల వివరాలు అడిగి తెలుసుకున్నారు. దుకాణంలో ఉన్న ఎల్‌ఈడీ టీవీ చోరీకి గురైందని చెప్పడంతో అంతా ఖంగుతిన్నారు. లక్షలు విలువ చేసే ఆభరణాలను వదిలి కేవలం రూ.7 వేల విలువైన టీవీ దొంగతనం చేయడం ఏమిటని ఆశ్చర్యానికి గురయ్యారు. టీవీ దొంగిలించిన వ్యక్తి బంగారు ఆభరణాలను కనీసం టచ్ కూడా చేయక పోవడం విశేషమని అక్కడ కథలుకథలుగా చెప్పుకుంటున్నారు. కాగా కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుడి కోసం తీవ్రంగా గాలిస్తున్నారు. సీసీటీవీ ఫుటేజీ ఆధారంగా నిందితుడిని గుర్తించే పనిలో పడ్డారు పోలీసులు.