కన్నకొడుకుని చంపిన తండ్రి

కన్నకొడుకుని చంపిన తండ్రి

గుంటూరులో ఘోరం చోటుచేసుకుంది. కన్నకొడుకుని తండ్రే అతి కిరాతకంగా హత్య చేసిన అమానుష ఘటన జరిగింది. జిల్లాలోని క్రోసూరు మండలం పారుపల్లికి చెందిన బాజిబాబు(22) కన్నతండ్రి చేతిలో దారుణ హత్యకు గురయ్యాడు. తండ్రీకొడుకుల మధ్య చెలరేగిన వివాదం హత్యకు దారితీసింది. ఇద్దరి మధ్య మాటామాటా పెరగడంతో విచక్షణ కోల్పోయిన తండ్రి కన్నకొడుకుని కిరాతకంగా నరికి చంపాడు. గొడ్డలితో తలపై దాడి చేయడంతో బాజిబాబు మృతి చెందాడు.

మద్యం తాగే విషయమై ఇద్దరి మధ్య ఘర్షణ చెలరేగినట్లు తెలుస్తోంది. మద్యం మత్తులోనే ఈ ఘాతుకానికి ఒడిగట్టినట్లు సమాచారం. విషయం తెలుసుకున్న పోలీసులు వెంటనే సంఘటన స్థలానికి చేరుకున్నారు. మృతదేహాన్ని పరిశీలించి పోస్టుమార్టం కోసం ఆస్పత్రికి తరలించారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.