కడప జిల్లాలో పెట్రోల్ ట్యాంక్ పేలిపోయి పెద్ద ఎత్తున మంటలు

కడప జిల్లాలో పెట్రోల్ ట్యాంక్ పేలిపోయి పెద్ద ఎత్తున మంటలు

కడప జిల్లాలో కొద్దిసేపటిక్రితం ఘోరమైన రోడ్డు ప్రమాదం జరిగింది. రైల్వే కోడూరు మండలం శెట్టిగుంట లక్ష్మీగారిపల్లెలో మితిమీరిన వేగంతో వెళ్తున్న ఒక ద్విచక్రవాహనం అదుపుతప్పి, అక్కడే ఉన్న ఆర్టీసీ బస్సుని బలంగా ఢీకొట్టింది. అనంతరం ఆ బైక్ బస్సు కిందకి దూసుకెళ్లింది. ఆ ప్రమాదంలో స్కూటర్ కి సంబందించిన పెట్రోల్ ట్యాంక్ పేలిపోయి పెద్ద ఎత్తున మంటలు చెలరేగాయి. ఈ మంటల్లో బస్సు లో మంటలు చెలరేగి బస్సు అంతా కూడా తగలడిపోయింది. అయితే ఈ ప్రమాదంలో ద్విచక్ర వాహన దారులు మరణించారు కానీ, మంటలు అంటుకున్న విషయం గమనించి బస్సులోని ప్రయాణికులు త్వరగా దిగిపోవడంతో పెద్ద ప్రమాదం తప్పింది.ఈ సమయంలో బస్సు కండక్టర్ చాలా అప్రమత్తంగా వ్యవహరించి అందరిని క్షేమంగా దింపేసాడు. అయితే సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసుకున్నారు. మరణించిన వారి మృతదేహాలు ప్రభుత్వాసుపత్రికి తరలించారు.