దారుణం…ప్రియురాలిని రేప్ చేయబోతే పారిపోయిన ప్రియుడు !

ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి సమీపంలోని పెదవడ్లపూడిలో దారుణ ఘటన ఒకటి చోటు చేసుకుంది. తన ప్రియుడితో కలసి వాహనం వెళుతున్న యువతిని ఇద్దరు వ్యక్తుకు తాము పోలీసులమని చెబుతూ ప్రియుడిని కొట్టి, ఆమెను పొలాల్లోకి లాక్కెళ్లి రాత్రంతా సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు అయుతే ఈ ఘటనలో వారికి ఉడురి తిరిగి ప్రియురాలిని రక్షించుకోవాల్సిన ప్రియుడు పారిపోయాడు. ఇలా తన ప్రియురాలిని ఇద్దరు పోలీసులు(నకిలీ) చెరబట్టారు అన్న విషయాన్ని కనీసం పోలీసులకు కూడా సమాచారం ఇవ్వలేదు. గత శుక్రవారం రాత్రి జరిగిన ఈ ఘటన చాలా ఆలస్యంగా ఆదివారం పోలీసుల దృష్టికి వచ్చింది.

బాధితురాలి నుంచి పోలీసులు సేకరించిన వివరాల మేరకు, తన స్నేహితురాలి ద్వారా పరిచయమైన జోసఫ్ తంబి అనే యువకుడిని మంగళగిరి ఆసుపత్రిలో నర్సుగా పనిచేసే ఆమె కొంతకాలంగా ప్రేమిస్తోంది. ఆసుపత్రిలో శుక్రవారం రాత్రి 10 గంటల సమయంలో విధులను ముగించుకుని, జోసఫ్ తో కలసి బైక్ పై ఇంటికి బయలుదేరింది. పెదవడ్లపూడి సమీపంలో అడ్డుకున్న వ్యక్తులు, జోసఫ్ ను కొట్టి, బెదిరించి పంపించి వేసి నర్సుపై అత్యాచారం చేశారు. రాత్రంతా ఆమె పొలాల మధ్యే పడివుంది. తెల్లారిన తరువాత స్థానికులు గమనించి ఆమె బంధువులకు సమాచారం ఇవ్వగా వారు వచ్చి ఆసుపత్రికి తరలించారు.