టీడీపీ లోకి గంగుల…జగన్ కి మైండ్ బ్లాక్.

gangula pratap reddy joins in TDP

Posted [relativedate] at [relativetime time_format=”H:i”]  
నంద్యాల ఉపఎన్నికలకు ముందు వైసీపీ అధినేత జగన్ కి మైండ్ బ్లాక్ అయ్యింది. వైసీపీ ముఖ్యనేత, నంద్యాలలో ఆ పార్టీ సీనియర్ నాయకుడు గంగుల ప్రతాపరెడ్డి జగన్ కి దిమ్మ తిరిగే షాక్ ఇచ్చాడు. ఎవరూ ఊహించని రీతిలో ఆయన సీఎం చంద్రబాబు సమక్షంలో టీడీపీ లో చేరారు. మంత్రి అచ్చెన్నాయుడు, దేశం నాయకుడు ఏరాసు ప్రతాప రెడ్డి కలిసి గంగులని సీఎం దగ్గరికి తీసుకెళ్లారు. నంద్యాల లో శిల్పా ని ముందుకు తీసుకురావడంతో తీవ్ర అసంతృప్తికి గురి అయిన గంగుల ప్రతాప్ రెడ్డి అనూహ్య నిర్ణయంతో వైసీపీ బిత్తరపోయింది. నంద్యాల రాజకీయాల్లో చెప్పుకోదగ్గ పట్టున్న గంగుల పార్టీ మారడం వైసీపీ కి కోలుకోలేని దెబ్బగా రామజకీయ పరిశీలకులు భావిస్తున్నారు.

మరిన్ని వార్తలు:

నంద్యాలలో జగన్ కి ఆ ఛాన్స్ ఇవ్వని పవన్.

ఓటును తూటాగా మార్చండి

బ్యాన‌ర్ డ్రిల్ తో చల్లారిన ఉద్రిక్త‌త‌లు