హైదరాబాద్ నడిబొడ్డున…యువతీ దారుణ హత్య !

girl was murdered brutally in meerpet

 

హైదరాబాద్‌ లో దారుణం చోటు చేసుకుంది. రెండ్రోజుల క్రితం నుండి తప్పిపోయిన ఓ బాలిక దారుణ హత్యకు గురైంది. తమ కూతురు వస్తుంది అని ఎదురు చూస్తున్న ఆ తల్లిదండ్రులకి విషయం తెలియడంతో ఇప్పుడు వారిని ఓదార్చడం ఎవరి వలనా కావడం లేదు. అందుతున్న సమాచారం మేరకు మీర్‌పేట్‌ పోలీస్‌స్టేషన్‌ పరిధిలోని అల్మాస్‌గూడ రాజీవ్‌ గృహకల్ప కాలనీలో నివాసముండే 8వ తరగతి చదువుతున్న 14 ఏళ్ల బాలిక వైష్ణవి తప్పిపోయింది. తమకు అవకాశం ఉన్న అన్ని చోట్లా వెతికినా జాడ లేకపోవడంతో తల్లిదండ్రులు నిన్న(ఆదివారం) స్థానిక పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు.

meerpet

 

సోమవారం ఉదయం సమీపంలోని చర్చి వద్ద ఒక బాలిక మృతదేహం కనపడడంతో స్థానికులు గుర్తించి పోలీసులకు సమాచారం ఇచ్చారు. దీంతో సంఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు అది వైష్ణవి మృతదేహమే అని గుర్తించారు. తల్లిదండ్రులకి సమాచారం ఇవ్వడంతో వారు తమ కుమార్తెను గుర్తించారు. తొలుత బాలికను అపహరించిన దుండగులు ఆమెను హత్య చేసి సమీపంలోని చర్చి ప్రాంతంలో మృతదేహాన్ని పడేసి వెళ్లిపోయారు. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Girl Was Murdered