విమాన ప్రయాణికులకు అదిరిపోయే శుభవార్త

విమాన ప్రయాణికులకు అదిరిపోయే శుభవార్త

విమాన ప్రయాణికులకు అదిరిపోయే శుభవార్త. దిగ్గజ విమానయాన కంపెనీ ఇండిగో బంపరాఫర్ ప్రకటించింది. చౌక ధరల విమాన టికెట్ ఆఫర్ తీసుకువచ్చింది. 15వ వార్షికోత్సవం సందర్భంగా కంపెనీ ప్రయాణికులకు ఈ ఆఫర్‌ను అందుబాటులో ఉంచిందని చెప్పుకోవచ్చు.టికెట్ ధరల డిస్కౌంట్ ఆఫర్ కేవలం కొన్ని రోజులు మాత్రమే అందుబాటులో ఉంటుంది. ఆగస్ట్ 4 నుంచి ఆగస్ట్ 6 వరకే ఈ ఆఫర్ వర్తిస్తుంది.

ఇండిగో ట్విట్టర్ వేదికగా ఈ విషయాన్ని వెల్లడించింది. ఆఫర్‌లో భాగంగా ప్రయాణికులు కేవలం రూ.915 ప్రారంభ ధరతో టికెట్ బుక్ చేసుకోవచ్చు.ఆఫర్‌లో భాగంగా టికెట్లు బుక్ చేసుకున్న వారు సెప్టెంబర్ 1 నుంచి 2022 మార్చి 26లోపు ఎప్పుడైనా ప్రయాణం చేయొచ్చు. అదే హెచ్ఎస్‌బీసీ క్రెడిట్ కార్డు కలిగిన వారికి అదనంగా 5 శాతం క్యాష్‌బ్యాక్ లభిస్తోంది. కనీసం రూ.3 వేల విలువైన ట్రాన్సాక్షన్ నిర్వహించాలి. రూ.750 వరకు క్యాష్‌బ్యాక్ వస్తుంది.