మెగాస్టార్ అభిమానులకు శుభవార్త

మెగాస్టార్ అభిమానులకు శుభవార్త

మెగాస్టార్ చిరంజీవి కూడా సోషల్ మీడియాలోకి ఎంట్రీ ఇవ్వబోతున్నట్లు ఒక వీడియోను రిలీజ్ చేశారు.వీడియోలో చిరు మాట్లాడుతూ… ఇక నుండి తన భావాలను అభిప్రాయాలను ఎప్పటికప్పుడు ప్రజలతో ఫ్యాన్స్ తో పంచుకోవటానికి తానూ కూడా ఉగాది నుండి సోషల్ మీడియాలోకి వస్తోన్నట్లు మెగాస్టార్ వీడియోలో తెలిపారు. ఇది మెగాస్టార్ అభిమానులకు శుభవార్తే. తమ అభిమాన హీరో ఆలోచనలను అభిప్రాయాలను ఎప్పటికపుడు వాళ్ళు తెలుసుకోవచ్చు.

ఇక ప్రస్తుతం మెగాస్టార్, కొరటాల శివ దర్శకత్వంలో రాబోతున్న ‘ఆచార్య’ సినిమాలో నటిస్తున్నారు. నిరంజన్ రెడ్డి, రామ్ చరణ్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రానికి మణిశర్మ సంగీతం అందిస్తున్నారు. ఈ ఏడాది ఆగష్టు నెలలో చిత్రాన్ని ప్రేక్షకులకు అందివ్వడానికి సన్నాహాలు చేస్తున్నారు టీమ్.