తుపాకీ మిస్‌ఫైర్‌.. ఆర్మీ జవాను మృతి

gun misfire

హైదరాబాద్‌ : తుపాకీ మిస్‌ఫైర్‌ కావడంతో ఓ ఆర్మీ జవాను మృతి చెందాడు. ప్రకాశం జిల్లా పాపినేనిపల్లి గ్రామానికి చెందిన తమ్మినేని అశోక్‌ కుమార్‌.. జమ్మూకశ్మీర్‌లో జవానుగా విధులు నిర్వర్తిస్తున్నాడు. అశోక్‌ వద్ద ఉన్న తుపాకీ మిస్‌ఫైర్‌ కావడంతో నిన్న మృతి చెందినట్లు ఆర్మీ సిబ్బంది.. మృతుడి తల్లిదండ్రులకు తెలియజేశారు. మూడురోజుల్లో మృతదేహాన్ని స్వగ్రామానికి తరలిస్తామని ఆర్మీ అధికారులు చెప్పినట్లు అశోక్‌ తల్లిదండ్రులు వెల్లడించారు. అశోక్‌ సోదరుడు సురేశ్‌ బాబు కూడా ఇండియన్‌ ఆర్మీలోనే పని చేస్తున్నాడు. మృతుడి నివాసంలో విషాదఛాయలు అలుముకున్నాయి.