కిలిమంజారోపై జగన్ పై అభిమానాన్ని చాటుకున్నశంకరయ్య

కిలిమంజారోపై జగన్ పై అభిమానాన్ని చాటుకున్నశంకరయ్య

చిల్డ్రన్ స్పేస్ క్లబ్ సభ్యుడు సభ్యుడు శంకరయ్య తాజాగా కిలిమంజారో పర్వతారోహణ చేసారు. గుంటూరు కి చెందిన ఈ వ్యక్తి ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి ఫై అభిమానాన్ని చాటుకున్నారు. ప్రపంచంలో నే రెండో ఎత్తైన పర్వతం ఈ కిలిమంజారో, ఈ పర్వతం ఫై ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి అయిన వైయస్ జగన్ మోహన్ రెడ్డి ఫోటో ని ప్రదర్శించారు. జాతీయ జెండాని ఎగరవేసి దేశభక్తిని చాటుకున్నారు. జనవరి 17 వ తేదీన హైదరాబాద్ నుండి బయలుదేరిన అతను 23 వ తేదీ ఉదయం 10 గంటలకు ఈ ఘనత సాధించినట్లు క్లబ్ కార్యదర్శి జి. శాంతమూర్తి తెలిపారు.స్పోర్ట్స్ కోచ్ గా పని చేసే శంకరయ్య తన వెంట డిగ్రీ రెండవ సంవత్సరం చదువుకొనే శీలం ఈశ్వరయ్య కూడా పర్వతాన్ని అధిరోహించారు. ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి ఫై వైసీపీ నేతలు సైతం రకరకాలుగా అభిమానాన్ని చాటుకున్నారు. కానీ శంకరయ్య చేసిన ఈ పనికి పలువురు హర్షం వ్యక్తం చేస్తున్నారు.