దారుణం: అప్పుకోసం భార్యలను తనఖా పెట్టిన భర్తలు…..

20-year-old- girl gang-rape-in-chittoor

కరోనా వైరస్.. దాంతో లాక్ డౌన్ ప్రజానీకం తీవ్ర ఇబ్బందుల్లో ఉన్న వేళ. కొందరు తమకు అనుకూలంగా మలుచుకొని చాన్నాళ్ల నుంచి ఉన్న కోరికలను తీర్చుకొనేందుకు తప్పుడు కార్యాలకు ఒడిగడుతున్నారు. తాజాగా కోల్‌కత్తాలో దారుణం చోటు చేసుకుంది. జల్సాలకు బానిసలైన దుర్మార్గులు తీసుకున్న అప్పు స‌కాలంలో తీర్చ‌లేక తమ భార్యలని ఓ వ్యక్తికి తాకట్టు పెట్టేశారు. ఎన్నో ఆశలతో అత్తారింట్లో అడుగుపెట్టిన వారికి జీవితం నరకంగా మారిపోయింది. ఇంటి అప్పు తీర్చుకొనేందుకు ఆ ఇద్దరు మహిళలను వారి భర్తలు.. తమకు అప్పు కోసం తాకట్టు పెట్టేశారు.

అసలు ఇంత అనాగరికమైన లోకం ఇంకా ఉందా సమాజంలో అనే అనుమానం కలగక మానదు. అదేమంటే.. అప్పు ఇచ్చిన వ్యక్తికి కావాల్సినప్పుడల్లా.. ఈ ఇద్దరు మహిళలు అతని పడక సుఖం తీర్చేలా వారి భర్తలు ఒప్పందం కుదుర్చుకున్నారు. ఆ వ్యక్తి మహిళలను వేరే ఓ ప్రాంతానికి తీసుకువెళ్లి బలవంతంగా అత్యాచారం చేశాడు. ఇదేమిటి అని నిలదీయగా.. తమ భర్తలే అప్పు తీర్చడం కొసం తనఖా పెట్టినట్లు తెలుసుకొని షాక్ కు గురయ్యారు. ఇంటికి వెళ్లి భర్త, అత్తమామలను వారు నిలదీయగా పుట్టింటికి వెళ్లి ఇద్దరూ చెరో రూ.5లక్షలు తేవాలని లేకపోతే అప్పు ఇచ్చిన వారితో శృంగారంలో పాల్గొనవలసిందేనని నిర్మొహమాటంగా చెప్పేశారు. దీంతో ఎన్నో ఆశలు పెట్టుకొని కొత్త జీవితాన్ని ప్రారంభించిన ఆ మహిళలు ఇప్పుడు అప్పుడు ఇచ్చిన వాడి కామానికి బలి అవుతోన్న ఘటన తాజాగా వెలుగు చూసింది. దీనిపై పోలీసులు సీరియస్ గా దర్యాప్తు మొదలు పెట్టారు.