‘పుష్ప’పై కేసు నమోదు

‘పుష్ప’పై కేసు నమోదు

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్‌, డైరెక్ట‌ర్ సుకుమార్ కాంబినేష‌న్‌లో రూపొందుతోన్న చిత్రం ‘పుష్ప ది రైజ్‌’. పాన్ ఇండియా లెవ‌ల్లో తెలుగు, త‌మిళ‌, హిందీ, క‌న్న‌డ‌, మ‌ల‌యాళ భాష‌ల్లో డిసెంబ‌ర్ 17న విడుద‌ల‌కు సిద్ధ‌మైంది. ఆదివారం డిసెంబ‌ర్ 12న మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ హైద‌రాబాద్‌లో జ‌రిగింది. భారీ ఎత్తున అభిమానులు హాజ‌ర‌య్యారు. అంతా బాగానే ఉంది. కానీ.. ఈవెంట్ త‌ర్వాత అస‌లు ర‌చ్చ మొద‌లైంది. హైద‌రాబాద్‌లోని జూబ్లీ హిల్స్ పోలీసులు పుష్ప ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను ఆర్గ‌నైజ్ చేసిన శ్రేయాస్ మీడియా, ఆర్గ‌నైజ‌ర్ కిషోర్‌పై సెక్ష‌న్ 143, 290, 331, 346ల‌పై కేసు న‌మోదు చేశారు.

అందుకు కార‌ణంగా ప‌ర్మిష‌న్ తీసుకున్న ఆర్గ‌నైజ‌ర్స్ 5000 పాసుల‌కు మాత్ర‌మే అనుమ‌తి తీసుకున్నారు. అయితే ఎక్కువ పాసుల‌ను పంచార‌ట‌. దీంతో భారీ సంఖ్య‌లో అభిమానులు వ‌చ్చారు. దీంతో ప‌రిస‌ర ప్రాంతాలు ర‌ద్దీగా మారిపోయాయి. ట్రాఫిక్ స‌మ‌స్య‌లు త‌లెత్తాయి. మ‌రి జ‌నం ఎక్కువ కావ‌డంతో తొక్కిస‌లాట కూడా జ‌రిగింద‌ని ఈవెంట్ మేనేజ‌ర్స్ కంట్రోల్ చేసే ప్ర‌య‌త్నం చేసినా కుద‌ర‌లేదట‌. ఈ విష‌యంపై గుస్సా అయిన జూబ్లీ హిల్స్ పోలీసులు ఈవెంట్ ఆర్గ‌నైజ‌ర్స్‌పై కేసు న‌మోదు చేశారు.

ఇక పుష్ప సినిమా విష‌యానికి వ‌స్తే.. ఇది రెండు భాగాలుగా రూపొందుతోంది. అందులో తొలి భాగం పుష్ప ది రైజ్ డిసెంబ‌ర్ 17న పాన్ ఇండియా లెవ‌ల్లో విడుల‌కు సిద్ధ‌మైంది. ఇప్ప‌టి వ‌ర‌కు బ‌న్నీ చేయ‌ని స‌రికొత్త మాస్ పాత్ర పుష్ప‌రాజ్‌ను ఇందులో క్యారీ చేశారు. ఇదొక లారీ డ్రైవ‌ర్ పాత్ర‌. పుష్ప‌రాజ్ ప్రేయ‌సి శ్రీవ‌ల్లి పాత్ర‌లో ర‌ష్మిక మంద‌న్న న‌టించింది. స్టార్ హీరోయిన్ స‌మంత ఈ సినిమాలో ఐటెమ్ సాంగ్ చేసింది. మ‌ల‌యాళ స్టార్ ఫ‌హాద్ ఫాజిల్ విల‌న్‌గా న‌టించారు. ఇక సునీల్, అన‌సూయ‌, అజ‌య్ త‌దిత‌రులు ఇత‌ర కీల‌క పాత్ర‌ల్లో న‌టించారు.

చిత్తూరు జిల్లా శేషాచ‌ల అడ‌వుల్లో జ‌రిగే ఎర్ర‌చందనం స్మ‌గ్లింగ్ నేప‌థ్యంలో పుష్ప సినిమాను తెర‌కెక్కిస్తున్నారు డైరెక్ట‌ర్ సుకుమార్‌. ఆర్య‌, ఆర్య 2 చిత్రాల త‌ర్వాత బ‌న్నీ, సుక్కు కాంబోలో వ‌స్తున్న మూడో చిత్ర‌మిది. సినిమాపై ఉన్న అంచ‌నాల కార‌ణంగా రూ.250 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ కూడా అయ్యింద‌ని వార్త‌లు నెట్టింట చ‌క్క‌ర్లు కొట్టాయి. బ‌న్నీ ఫ్యాన్స్‌, తెలుగు ప్రేక్ష‌కులు సినిమా కోసం ఎంతో ఆస‌క్తిగా ఎదురుచూస్తున్నారు. మ‌రో వైపు అల వైకుంఠ పుర‌ములో చిత్రంతో ఇండ‌స్ట్రీ హిట్ కొట్టి బ‌న్నీ.. రంగ‌స్థ‌లంలో సెన్సేష‌న‌ల్ బ్లాక్ బ‌స్ట‌ర్ కొట్టిన సుకుమార్ కాంబోలో వ‌స్తున్న ఈ సినిమా క‌లెక్ష‌న్స్ ప‌రంగా ఎలాంటి రికార్డుల‌ను క్రియేట్ చేయ‌నుందోనిన ట్రేడ్ వ‌ర్గాలు అస‌క్తిగా గ‌మ‌నిస్తున్నాయి.