టాప్ నుండి రెండో స్థానానికి…

టాప్ నుండి రెండో స్థానానికి...

అంతర్జాతీయ క్రికెట్‌ మండలి ఐసీసీ ప్రకటించిన మహిళల వ్యక్తిగత వన్డే ర్యాంకింగ్స్‌లో భారత మహిళా క్రీడాకారిణి స్మృతి మంధాన రెండో స్థానానికి చేరుకుంది. టాప్‌లో ఉన్న ఈ మహిళా క్రీడాకారిణి స్మృతి మంధాన గాయం కారణంగా దక్షిణాఫ్రికాతో ముగిసిన వన్డే సిరీస్‌లో ఆడలేకపోయింది. న్యూజిలాండ్‌ ప్లేయర్‌ అమీ సాటర్త్‌వెయిట్‌ 759పాయింట్లతో మొదటి ర్యాంక్‌లో ఉండగా రెండో స్థానంలో 755రేటింగ్‌ పాయింట్లతో భారత క్రీడాకారిణి స్మృతి మంధాన నిలిచింది.వన్డే సిరీస్‌కు ఆడలేక పోవడం వల్ల స్మృతి మంధాన వ్యక్తిగత ర్యాంకింగ్‌ తగ్గి భారత్‌కు నిరాశ ఎదురైంది.

18వ స్థానంలో ఉన్న టి20 కెప్టెన్ హర్మన్‌ ప్రీత్‌ కౌర్‌ ఇపుడు 17వ స్థానంలో నిలిచింది. క్రికెట్‌ కెరీర్‌లో 20 సంవత్సరాలు పూర్తి చేసుకున్న మహిళా క్రికెట్ సారథి మిథాలీ రాజ్‌ 6వ స్థానంలో ఉండగా ఇపుడు 7వ స్థానంలో నిలిచింది