ఆసియా గేమ్స్ లో బంగారు “బోణీ”…!

India's First Gold Medal In Asian Games

ఇండోనేషియా రాజధాని జకార్తా వేదికగా జరుగుతున్న ఆసియా గేమ్స్‌లో భారత్‌‌కి తొలి బంగారు పతకం లభించింది. నిన్న మధ్యాహ్నం 10 మీటర్ల ఎయిర్ రైఫిల్ మిక్స్‌డ్ టీమ్ ఈవెంట్‌లో షూటర్లు అపూర్వీ చండేలా, రవి కుమార్‌లు కాంస్య పతకంతో భారత్ పతకాల ఖాతా తెరవగా.. తాజాగా రెజ్లింగ్‌లో భజరంగ్ పునియా బంగారు పతకం తెచ్చిపెట్టాడు. 65 కేజీల విభాగంలో పోటీపడిన భజరంగ్ ఫైనల్లో జపాన్‌కి చెందిన టకటానిదైచీని 10-8 తేడాతో మట్టి కరిపించాడు. దీంతో.. తొలిరోజే భారత్ ఖాతాలో రెండు పతకాలు చేరాయి.

india

 

అయితే భారీ అంచనాల మధ్య అడుగుపెట్టిన భారత రెజ్లర్ సుశీల్ కుమార్‌తో పాటు పవన్ కుమార్, మౌసమ్ ఖత్రి నిరాశపరచగా తొలి రౌండ్‌ నుంచి అద్భుత ప్రదర్శన కనబర్చిన భజరంగ్ మాత్రం పసిడి పతకంతో భారత్‌ని మురిపించాడు. క్వార్టర్స్‌లో తజకిస్థాన్‌కి చెందిన అబ్ధుల్ ఖాసీమ్‌తో జరిగిన ఫైట్‌లో 12-2 తేడాతో గెలిచిన భజరంగ్.. ఫైనల్‌ వరకూ అదేజోరుని కొనసాగించాడు. 2014 ఆసియా గేమ్స్‌లో భారత్ 11 బంగారు పతకాలు గెలవగా ఈ విదార్హ మరిన్ని పధకాలు సాధించే దిశగా భారత క్రీడాకారులు పోటీపడుతున్నారు.

gold-medal