తెలుగు రాష్ట్రాలకి రెడ్ అలెర్ట్….మూడు రోజులు !

ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో మరో మూడు రోజులు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణశాఖ అధికారులు హెచ్చరించారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. బంగాళాఖాతంలో తీవ్ర వాయుగుండం ఏర్పడిందని, దీని ప్రభావం కారణంగా రానున్న మూడు రోజులపాటు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లోని పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం కోస్తా, ఒడిశా పరిసర ప్రాంతాల్లో కొనసాగుతోందని తెలిపారు. చత్తీస్‌గఢ్, విదర్భ ప్రాంతాల్లో తూర్పు ఆగ్నేయ దిశగా కేంద్రీకృతం అయిందని పేర్కొన్నారు.

వాయుగుండం ప్రభావంతో వచ్చే మూడు రోజులపాటు తెలుగు రాష్ట్రాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. తెలుగు రాష్ట్రాల్లో ఇప్పటికే విస్తారంగా వర్షాలు కురుస్తుండగా, కేరళ సహా దేశవ్యాప్తంగా వరదలు బీభత్సం సృష్టిస్తున్నాయి. కేరళలో అయితే పరిస్థితి మరీ దుర్భరంగా ఉంది. సుమారు వెయ్యి మంది మరణించగా, లక్షల్లో జనం నిరాశ్రయులయ్యారు. 14 జిల్లాల్లో ప్రభుత్వం రెడ్ అలెర్ట్ ప్రకటించింది. వాతావరణ శాఖ హెచ్చరికలతో ఇరు రాష్ట్ర ప్రభుత్వాలు తమ తమ అధికార యంత్రాంగాన్ని అప్రమత్తం చేసినట్టు సమాచరం అందుతోంది.