గోల్డెన్‌ ఫెరారీపై అసహనం

గోల్డెన్‌ ఫెరారీపై అసహనం

మహీంద్రా అండ్ మహీంద్రా గ్రూప్ చైర్మన్ ఆనంద్ మహీంద్రా  సోషల్ మీడియాలో చాలా యాక్టివ్‌గా ఉన్నారు. సాధారణంగా చలోక్తులు, ఆసక్తికరవిషయాలు, విజ్ఞాన దాయక విషయాలనే  సోషల్ మీడియాలో పోస్టు చేస్తూ ఉంటారు.తాజాగా  ఆయన చేసిన మరో ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.  ఇపుడు మాత్రం అతి ఖరీదైన గోల్డెన్‌  ఫెరారీపై మాత్రం కొంత అసహనం వ్యక్తం చేశారు. హంగూ. ఆర్భాటాలతో లగ్జరీ కారు ఓనరు హడావిడి, క్రేజ్‌పై ఆయన ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

ఇలాంటి  వీడియోను ఎందుకు చూస్తున్నారో తెలియదు, దానినుండి ఏదైనా నేర్చుకునేది ఉంటే ఆశ్చర్యం లేదు. కానీ డబ్బుం​టే దానిని  ప్రదర్శించాల్సిన అవసరం లేదు. ఇలాంటివి సోషల్‌ మీడియాలో ఎందుకు వైరల్‌ అవుతాయో అర్థం కాదంటూ విసుగు ప్రదర్శించారు. ఈ సందర్భంగా ఆయన షేర్‌ చేసిన వీడియో వైరల్‌గా మారింది.  అయితే దీనిపై  కొంతమంది నెటిజన్లు నెగిటివ్‌  కమెంట్లు కూడా చేశారు.

ఆనంద్ మహీంద్రా ఆటోమొబైల్స్ ప్రపంచంలో వివిధ పరిణామాలపై తన అభిప్రాయాన్ని ట్విటర్‌ ద్వారా తెలియజేస్తూ ఉంటారు.  ఈక్రమంలోనే ఇటీవల గ్రీన్ మొబిలిటీకి తన మద్దతు అంటూ రాబోయే ఓలా ఎలక్ట్రిక్ స్కూటర్‌పై ట్విట్‌ చేశారు.

వాస్తవానికి పూర్తిగా బంగారు పూత పూసిన  ఈ వీడియో  2017లో తొలిసారిగా  వెలుగులోకి వచ్చింది.  సౌదీ నంబరు ప్లేట్‌తో  ఈ కారు నిజమైన యజమాని ఎవరు, అసలు యజమాని నుండి  ఈ కారును ఇండో-అమెరికన్‌ కొనుగోలు చేశారా అనేది స్పష్టత లేదు. కాగా ఇటలీకి చెందిన కార్ల కంపెనీ ఫెరారి  అత్యంత విలువ గల కార్లను ఇండియా మార్కెట్ లోకి రిలీజ్ చేస్తున్న సంగతి తెలిసిందే.