ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో ‘ఇరుముడి’ సినిమా జోరు కొనసాగుతోంది. చిన్నా పెద్దా అనే తేడా లేకుండా ప్రేక్షకులు ఈ సినిమాను చూసేందుకు థియేటర్లకు క్యూ కడుతున్నారు. తండ్రీ కూతుళ్ల సెంటిమెంట్కు అయ్యప్ప స్వామి నేపథ్యం తోడవడంతో ఈ చిత్రంపై ప్రేక్షకుల్లో ప్రత్యేకమైన ఆసక్తి ఏర్పడింది. దీంతో పూర్తిగా రీజినల్ సినిమాగా వచ్చిన ‘ఇరుముడి’ బాక్సాఫీస్ వద్ద పాన్ ఇండియా స్థాయి వసూళ్లను రాబడుతోంది.
వీక్ డేస్లోనూ రవితేజ సినిమాకు హౌస్ఫుల్ కలెక్షన్లు వస్తుండటం విశేషం. మొదట్లో ‘ఇరుముడి’ Irumudi రవితేజ కెరీర్లో తొలి రూ.100 కోట్ల గ్రాస్ చిత్రంగా నిలుస్తుందని చాలామంది భావించారు. అయితే ప్రస్తుత వసూళ్ల ట్రెండ్ చూస్తుంటే ఈ సినిమా కేవలం రూ.100 కోట్ల గ్రాస్కే పరిమితం కాకుండా రూ.100 కోట్ల షేర్ మార్క్ను కూడా అందుకునే దిశగా వెళ్తున్నట్లు ట్రేడ్ వర్గాల్లో చర్చ జరుగుతోంది. ప్రస్తుతం సినిమా వసూళ్లు దాదాపు రూ.150 కోట్లకు చేరువలో ఉన్నట్లు ట్రేడ్ నిపుణులు చెబుతున్నారు.
ఇదిలా ఉంటే, ‘ఇరుముడి’ సక్సెస్ నేపథ్యంలో ఈ సినిమాకు సంబంధించిన ఓ ఆసక్తికరమైన వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అదేంటంటే, ఈ చిత్రానికి రవితేజ మొదటి ఛాయిస్ కాదట. ఆయన కంటే ముందే దర్శకుడు శివ నిర్వాణ ఈ కథను పలువురు హీరోలకు వినిపించారనే టాక్ వినిపిస్తోంది. అయితే వివిధ కారణాలతో ఆ హీరోలు ఈ ప్రాజెక్ట్ను చేయలేకపోవడంతో చివరకు రవితేజను ఎంపిక చేసినట్లు ప్రచారం జరుగుతోంది.
నాగచైతన్యకు ముందుగా కథ?
దర్శకుడు శివ నిర్వాణ మొదట అక్కినేని నాగచైతన్యకు ‘ఇరుముడి’ కథను వినిపించినట్లు టాక్. గతంలో వీరిద్దరి కాంబినేషన్లో వచ్చిన ‘మజిలీ’ మంచి విజయాన్ని అందుకోవడంతో మరోసారి ఈ కాంబినేషన్ను రిపీట్ చేయాలని భావించినట్లు తెలుస్తోంది. అయితే అప్పటికే నాగచైతన్య పలు ప్రాజెక్టులతో బిజీగా ఉండటంతో ఈ సినిమాను చేయలేకపోయారని సమాచారం.
గోపీచంద్ కూడా మిస్?
నాగచైతన్య తర్వాత మాచో స్టార్ గోపీచంద్ను కూడా ఈ సినిమా కోసం సంప్రదించినట్లు ప్రచారం జరుగుతోంది. అయితే ఆయన కూడా అప్పటికే ఇతర ప్రాజెక్టులతో బిజీగా ఉండటంతో ‘ఇరుముడి’కి డేట్స్ కేటాయించలేకపోయారని తెలుస్తోంది. దీంతో ఈ అవకాశం కూడా మరో హీరోకు వెళ్లినట్లు సమాచారం.
కోలీవుడ్ స్టార్ సూర్య కూడా?
ఇక ‘ఇరుముడి’ని మిస్ చేసుకున్న మరో స్టార్ హీరో కోలీవుడ్ స్టార్ సూర్య అని సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది. తొలుత ఈ చిత్రాన్ని తెలుగు, తమిళ భాషల్లో ఒకేసారి తెరకెక్కించాలని మేకర్స్ భావించినట్లు సమాచారం. ముఖ్యంగా తమిళనాడులో అయ్యప్ప స్వామికి ఉన్న విశేషమైన ఆదరణ దృష్ట్యా ఈ కథ రెండు భాషల్లోనూ మంచి వర్కౌట్ అవుతుందని అనుకున్నారట.
అయితే అప్పటికే సూర్య కూడా పలు ప్రాజెక్టులతో బిజీగా ఉండటం, డేట్స్ సమస్య కారణంగా ఈ సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వలేకపోయారని టాక్. దీంతో చివరకు రవితేజ ఈ ప్రాజెక్ట్లోకి ఎంట్రీ ఇచ్చినట్లు తెలుస్తోంది.
అలా నాగచైతన్య, గోపీచంద్, సూర్య.. ఈ ముగ్గురు స్టార్ హీరోలు ‘ఇరుముడి’ సినిమాను మిస్ చేసుకున్నారనే వార్త ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అయితే ఈ ప్రచారంలో ఎంతవరకు నిజం ఉందనే దానిపై అధికారికంగా ఎలాంటి క్లారిటీ లేదు. ఏదేమైనా, ఈ ముగ్గురిలో ఎవరు ఈ సినిమా చేసినా కథకు మరో రకమైన క్రేజ్ వచ్చేదనే చెప్పాలి. కానీ చివరకు రవితేజ చేతికి వచ్చిన ఈ ప్రాజెక్ట్ ఆయన కెరీర్లోనే ప్రత్యేకమైన విజయంగా నిలుస్తోంది.






