దగ్గిందని విమానం నుంచి దించేశారు

దగ్గిందని విమానం నుంచి దించేశారు

కరోనా వైరస్ నేపథ్యంలో చైనాలోని అన్ని విమానాశ్రయాల్లో వైద్య పరీక్షలు నిర్వహిస్తున్నారు. దీంతో ప్రయాణికులు గంటల తరబడి వేచి చూడాల్సి వస్తోంది. అయితే,షాంగై విమానాశ్రయంలోని థాయ్ ఎయిర్‌లైన్స్లోకి  ప్రవేశించిన తర్వాత కూడా పరీక్షలు నిర్వహిస్తుండటంతో ఓ మహిళ ప్రయాణికురాలి సహనం నశించింది. దగ్గు రాకపోయినా విమాన సిబ్బంది మీద దగ్గింది. దీంతో సిబ్బంది షాకయ్యారు. ఓ ఫ్లైట్ అటెండర్ వెంటనే మహిళను వెనక్కి వంచి గట్టిగా పట్టుకున్నాడు. ఆమె వాళ్ల మీదకు దగ్గకుండా తలను గట్టిగా పట్టుకున్నారు. అనంతరం వైద్య సిబ్బందికి అప్పగించారు.

ఈ ఘటన వల్ల విమానం ఏడు గంటలు ఆలస్యంగా బయల్దేరింది. ఈ ఘటనను కొందరు వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్టు చేయడంతో వైరల్‌గా మారింది. ఆమె వల్ల విమానంలో ఉన్న ప్రయాణికులంతా మళ్లీ కిందికి దిగి మరోసారి వైద్య పరీక్షలు చేయించుకోవలసి వచ్చింది. పూర్తిగా శుభ్రం చేసిన తర్వాతే విమానం ప్రయాణికులతో బయల్దేరింది.