పెరిగిపోతున్న కరోనా అనుమానితులు

పెరిగిపోతున్న కరోనా అనుమానితులు

గత కొంతకాలంగా ప్రపంచాన్ని అంతటిని వణికిస్తున్న కరోనా వైరస్ ఇటీవలే తెలుగు రాష్ట్రాల వరకు పాకింది. కాగా తెలంగాణ రాష్ట్రంలో కరోనా నిర్ధారణ అయినటువంటి మొదటి పేషేంట్ కి గాంధీ ఆసుపత్రిలోని ప్రత్యేకమైన ఐసోలేషన్ వార్డులో ఉంచి చికిత్స అందించారు. కాగా ఆ కరోనా నిర్ధారణ అయినటువంటి వ్యక్తి చివరికి కోలుకొని, పూర్తి ఆరోగ్యంతో ఆస్పత్రి నుండి డిశ్చార్జ్ కూడా అయ్యాడు. ఇకపోతే రోజురోజుకు కరోనా అనుమానితులు పెరిగిపోతున్నారు.

ఏపీలో కూడా నెల్లూరు జిల్లాలో కూడా ఒక కరోనా కేసు నమోదైనట్లు సమాచారం. కాగా ఆ వ్యక్తి ఇటీవలే ఇటలీ నుండి వచ్చాడని తెలుస్తుంది.కాగా కరోనా లక్షణాలతో ఇటీవల హైదరాబాద్ లోని ఒక ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స కోసం చేరినటువంటి ఒక 76 ఏళ్ళ వ్యక్తి నేడు మృతి చెందాడు. కాగా కర్ణాటక రాష్ట్రానికి చెందిన ఈ వ్యక్తి కరోనా లక్షణాలతో రెండు రోజుల క్రితం ఒక ప్రైవేట్ ఆసుపత్రిలో చేరాడు. అయితే ఆ వ్యక్తి చికిత్స పొందుతూనే మృతి చెందాడు. కాగా ఆ వ్యక్తి ఇటీవలే సౌదీ అరేబియా నుండి భారతదేశానికి వచ్చాడని సమాచారం.