రైతులపై ఒక్క పైసా భారం కూడా పడదు

రైతులపై ఒక్క పైసా భారం కూడా పడదు

ఏపీ సీఎం అధ్యక్షతన నేడు జరిగిన కేబినెట్ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ముఖ్యంగా ఉచిత విద్యుత్‌ పథకం నగదు బదిలీకి సంబంధించిన అంశానికి మంత్రివర్గం ఆమోదం తెలిపింది. అయితే ఈ సందర్భంగా సీఎం జగన్ మాట్లాడుతూ రైతులకు అందే విద్యుత్‌ ఎప్పటికీ ఉచితమేనని అన్నారు. ఒక్క కనెక్షన్ ‌కూడా తొలగించమని, ప్రస్తుతం ఉన్న కనెక్షన్లను రెగ్యులరైజ్‌ చేస్తామని అన్నారు.

అంతేకాదు కనెక్షన్‌ ఉన్న రైతులకు వారి పేరు మీద ప్రత్యేక ఖాతా తెరుస్తామని, ఆ ఖాతాలో ప్రభుత్వమే డబ్బులు జమ చేస్తుందని ఆ డబ్బును రైతులు డిస్కంలకు చెల్లిస్తే సరిపోతుందని అన్నారు. అయితే ఇదంతా ప్రభుత్వమే చూసుకుంటుందని మీటర్ల ఖర్చు కూడా ప్రభుత్వమే భరిస్తుందని అన్నారు. ప్రభుత్వం తీసుకొచ్చిన ఈ సంస్కరణల వలన రైతులపై ఒక్క పైసా భారం కూడా పడదని అన్నారు. రైతులకు ఉచిత విద్యుత్‌ తీసుకొచ్చిన ఘనత వైఎస్ఆర్‌దే అని అన్నారు. ఆనాడు ఉచిత విద్యుత్‌ కుదరదు, సాధ్యంకాదని చంద్రబాబు గారు ఎద్దేవా చేశారని గుర్తు చేశారు.