విషం తాగి వివాహిత ఆత్మహత్య

విషం తాగి వివాహిత ఆత్మహత్య

విషం తాగి వివాహిత ఆత్మహత్య చేసుకున్న సంఘటన మండలం అప్పంబట్టులో చోటు చేసుకుంది. స్థానిక పోలీసులు, రెవెన్యూ అధికారుల కథనం..గ్రామానికి చెందిన జయశంకర్‌ రెడ్డి, శెల్వి దంపతుల కుమార్తె కార్తీక (18)కు గ్రామంలోని భూపతమ్మ కుమారుడు సతీష్‌ కుమార్‌తో ఆరునెలల క్రితం వివాహమైంది. సోమవారం ఉదయం కార్తీక తన అత్తగారి ఇంట పురుగులు మందు తాగి అపస్మారక స్థితికి చేరుకుంది.

దీనిని గుర్తించిన కుటుంబ సభ్యులు ఆమెను చికిత్స నిమిత్తం చెన్నైలోని యంజీఆర్‌ ఆసుపత్రికి తరలించారు. చికిత్సపొందుతూ అదే రోజు సాయంత్రం కార్తీక మరణించింది. ఈ ఘటనపై స్థానిక పోలీసులకు మృతురాలి తండ్రి ఫిర్యాదు చేశారు. తొలుత సెక్షన్‌ 174 ప్రకారం కేసు నమోదు చేసి మృతదేహానికి యంజీఆర్‌ ఆసుపత్రిలో పోస్టుమార్టం నిర్వహించారు.

తమ కుమార్తె వరకట్న వేధింపుల వల్లే ఆత్మహత్యకు పాల్పడిందని మృతుతాలి తల్లి శెల్వి మంగళవారం రాత్రి పిచ్చాటూరు పోలీసులకు ఫిర్యాదు చేసింది. అదనపు వరకట్నం కోసం అల్లుడు, వియ్యంకురాలు, పెద్ద మామ బాషా తరచూ వేధించే వారని, వీరి వల్లే తమ కుమార్తె ఆత్మహత్యకు పాల్పడిందని పేర్కొంది.మృతురాలి భర్త, అత్త భూపతమ్మ, బాషాను అదుపులోకి తీసుకున్నారు. చెన్నై నుంచి మృతదేహాన్ని సత్యవేడు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.