ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి సంచలనమైన ప్రకటన

ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి సంచలనమైన ప్రకటన

ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఇటీవల శాసన సభ సమావేశాల్లో భాగంగా రాష్ట్రానికి మూడు రాజధానులను నిర్మిస్తామని చెప్పి ఒక సంచలనమైన ప్రకటనను చేశారు. కాగా సీఎం జగన్ నిర్ణయాన్ని నిరసిస్తూ అమరావతి ప్రాంతానికి చెందిన రైతులు, ప్రజలందరూ కూడా తీవ్రమైన ఆగ్రహజ్వాలలు రగిలిస్తున్నారు. కాగా ఈ మూడు రాజధానుల నిర్ణయంపై జగన్ ప్రభుత్వం మరొక కీలకమైన నిర్ణయాన్ని తీసుకుందని సమాచారం. కాగా ఇప్పటికే జీఎన్‌రావు కమిటీ అనంతరం బీసీజీ కమిటీని ప్రభుత్వం ఇప్పటికే నియమించింది. అయితే ఈ కమిటీ నివేదికను ప్రత్యేకంగా అధ్యయనం చేయడానికని ఆర్థికశాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ ఆధ్వర్యంలో ఒక హైపర్ కమిటీ ని ఏర్పాటు చేశారు.

అయితే ఈ మేరకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సంబంధిత ఉత్తర్వులు జారీ చేసింది. ఈ కమిటీలో పలువురు మంత్రులు కూడా ఉన్నారు. కాగా బుగ్గన రాజేంద్రనాధ్ రెడ్డి, పిల్లి సుభాష్ చంద్రబోస్, బొత్స సత్యనారాయణ, మేకపాటి గౌతంరెడ్డి, ఆదిమూలపు సురేష్, మేకతోటి సుచరిత, కురసాల కన్నబాబు, మోపిదేవి వెంకటరమణ, కొడాలి నాని, పేర్ని నాని, ముఖ్యమంత్రి ప్రధాన సలహాదారు, డీజీపీ, ఛీఫ్ కమిషన్ ఆఫ్ ల్యాండ్స్ అండ్ స్పెషల్ ఛీఫ్ సెక్రటరీ, మున్సిపల్ మరియు పట్టణాభివృద్ది కార్యదర్శి, న్యాయశాఖ కార్యదర్శి ఈ కమిటీలో సభ్యులుగా ఉన్నారు. అయితే ఈ కమిటీకి ఏపీ సీఎస్ నీలం సహానీ కన్వీనర్ గా వ్యవహరించనున్నారు. ఇకపోతే కేవలం మూడు వారాల్లోగా కమిటీ నివేదికని ఇవ్వాలని కన్వీనర్ నీలం సహానీ ఆదేశించారు.