సోషల్ మీడియాలో రచ్చ చేస్తున్న తారక్ ఫ్యాన్స్

సోషల్ మీడియాలో రచ్చ చేస్తున్న తారక్ ఫ్యాన్స్

మరోసారి తెలుగు చిత్ర పరిశ్రమ నుంచి ఒక భారీ చిత్రం దేశం బాక్సాఫీస్ అంతటిని ఏలడానికి సంసిద్ధం అవుతుంది.దర్శక ధీరుడు రాజమౌళి యంగ్ టైగర్ ఎన్టీఆర్ మరియు మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ ల కాంబో మొదలు పెట్టిన మహా యాగం “RRR”. అల్లూరి సీతారామరాజుగా చరణ్ అలాగే కొమరం భీం పాత్రలో తారక్ లు కనిపించబోతున్న ఈ విజువల్ పీరియాడిక్ థ్రిల్లర్ కోసం దేశం అంతా ఎంతగానో ఎదురు చూస్తుంది.

అయితే రాజమౌళి తన చిత్రం యొక్క ప్లాట్ లైన్ ఇది అని ముందే చెప్పేస్తూ ఉంటారు.అలాగే ఈ చిత్రానికి కూడా చెప్పారు.కానీ ఈ చిత్రం విషయంలో కాస్త స్పెషల్ అనే చెప్పాలి.మెయిన్ స్టోరీ ఏమిటా అన్నది కాస్త సస్పెన్స్ గానే ఉంచారు కానీ ఇప్పుడు ఓ కీలక వ్యక్తి చెప్పిన మాటలు విని ఒక్క తారక్ అభిమానులే కాదు ఈ చిత్రం కోసం ఎదురు చూస్తున్న సినీ ప్రేమికులు కూడా మరిన్ని అంచనాలు పెంచుకున్నారు.రాజమౌళి మరియు కీరవాణిల మధ్య అనుబంధం అందరికి తెలిసిందే.

అలా ఇటీవలే కీరవాణి గారి తనయుడు సింహా కోడూరి ప్రధాన పాత్రలో నటించిన “మత్తు వదలరా” చిత్రం తాలూకా ప్రమోషన్స్ లో భాగంగా ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో ఎన్టీఆర్ తీసిన చిత్రాల్లో ఏది మీకు బాగా ఇష్టం అని అడగ్గా ఇప్పుడు నటిస్తున్న RRR సినిమా స్టోరీ నాకు తెలుసు కాబట్టి ఈ చిత్రమే అని అన్నాడు.దీనితో తారక్ ఫ్యాన్స్ సోషల్ మీడియాలో రచ్చ చేస్తున్నారు.ఈ మాత్రం కాన్ఫిడెన్స్ తమకు చాలని ఇక సినిమా పగిలిపోతుంది హర్షం వ్యక్తం చేస్తున్నారు.