‘జై లవకుశ’ అప్పుడే అరుదైన రికార్డ్‌

Jai Lava Kusa Will Be Released In Hyderabad On 100 Screens

Posted [relativedate] at [relativetime time_format=”H:i”] 

యంగ్‌ టైగర్‌ ఎన్టీఆర్‌ సునామి మొదలైంది. మూడు విభిన్న పాత్రల్లో నటించి మెప్పించేందుకు ఎన్టీఆర్‌ ‘జై లవకుశ’ చిత్రంతో మరో అయిదు రోజుల్లో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. భారీ స్థాయిలో అంచనాలున్న ‘జైలవకుశ’ చిత్రం కొత్త రికార్డులను సృష్టించడం ఖాయం అంటూ నందమూరి అభిమానులు చాలా ఆశలు పెట్టుకున్నారు. అంచనాలను ఏమాత్రం తగ్గకుండా ఈ సినిమాను భారీ ఎత్తున విడుదల చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఒక్క హైదరాబాద్‌లోనే ఏకంగా 100 స్క్రీన్‌లలో విడుదల కాబోతుంది. ఇప్పటి వరకు ఏ సినిమా కూడా స్థాయిలో విడుదల అయ్యింది లేదు.

నైజాం ఏరియాలో ఎన్టీఆర్‌ సినిమాలకు మంచి క్రేజ్‌ ఉంటుంది. అందుకే ఆ క్రేజ్‌ను వినియోగించుకుని వారం రోజుల్లోనే కలెక్షన్స్‌ను రాబట్టే విధంగా భారీ ఎత్తున విడుదల చేస్తున్నారు. ఇక తెలంగాణలో సెలవులు కూడా ప్రారంభం కాబోతున్న నేపథ్యంలో జై లవకుశ దున్నుడు మామూలుగా ఉండదని నందమూరి ఫ్యాన్స్‌ చాలా నమ్మకంతో ఉన్నారు. నైజాం ఏరియాతో పాటు సీడెడ్‌లో కూడా ఎన్టీఆర్‌ దూకుడు కొనసాగనుంది. ఆ ఏరియాలో కూడా భారీ సంఖ్యలో థియేటర్లను సిద్దం చేస్తున్నారు. జైలవకుశ విడుదలైన వారం రోజుల్లోనే స్పైడర్‌ సినిమా రానుంది. కనుక వారం రోజుల్లోనే సాధ్యం అయినన్ని ఎక్కువ కలెక్షన్స్‌ను సాధించాలని కళ్యాణ్‌ రామ్‌ భావిస్తున్నాడు.