ఎన్టీఆర్‌కు మరో అవార్డు

Jr NTR Award For Janatha Garage

Posted [relativedate] at [relativetime time_format=”H:i”]

Another award For NTR Janatha Garage Movie

యంగ్‌ టైగర్‌ ఎన్టీఆర్‌ గత సంవత్సరం రెండు చిత్రాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. అందులో మొదటిది ‘నాన్నకు ప్రేమతో’ కాగా రెండవది ‘జనతాగ్యారేజ్‌’. ఈ రెండు సినిమాలు కూడా భారీ విజయాలను సొంతం చేసుకున్నాయి. ఇక ఈ రెండు చిత్రాల్లో ఎన్టీఆర్‌ నటకు మంచి మార్కులు పడ్డాయి. దాంతో ఈ సంవత్సరం ఎన్టీఆర్‌కు అవార్డుల పంట పండుతుంది. ఇప్పటికే ‘జనతా గ్యారేజ్‌’ చిత్రంకు గాను సైమా మరియు ఐఫా అవార్డులు అందుకున్న ఎన్టీఆర్‌ తాజాగా ‘నాన్నకు ప్రేమతో’ చిత్రంకు గాను ఫిల్మ్‌ఫేర్‌ అవార్డును సొంతం చేసుకున్నాడు. తాజాగా మరో అవార్డును కూడా ఎన్టీఆర్‌ దక్కించుకున్నాడు.

కళాతపస్వీ కె విశ్వనాథ్‌కు తాజాగా కేంద్ర ప్రభుత్వం దాదా సాహెబ్‌ పాల్కే అవార్డును ఇచ్చి గుర్తించిన విషయం తెల్సిందే. విశ్వనాథ్‌ ఎంతో మందిని నటీనటులను ఇండస్ట్రీకి పరిచయం చేయడం జరిగింది. శంకరాభరణం చిత్రంలో బాలనటిగా పరిచయం అయిన తులసి ప్రస్తుతం ప్రముఖ క్యారెక్టర్‌ ఆర్టిస్టుగా పేరు తెచ్చుకుంది. తనను ఇండస్ట్రీకి పరిచయం చేసిన గురువు పేరు మీద అవార్డులను ఇవ్వాలని ఆమె నిర్ణయించుకుంది. తెలుగుతో పాటు తమిళం, మలయాళం, హిందీ సినిమా పరిశ్రమలకు చెందిన 24 క్రాప్ట్స్‌కు అవార్డులు ఇవ్వబోతున్నట్లుగా ఆమె చెప్పుకొచ్చింది. శంకరాభరణం పేరుతో నేడు శిల్పకళావేదికలో జరుగబోతున్న ఈ అవార్డు వేడుకలో ఎన్టీఆర్‌ జనతాగ్యారేజ్‌ చిత్రానికి గాను ఉత్తమ నటుడు అవార్డును అందుకోబోతున్నాడు. ఇక హిందీ నుండి అమీర్‌ ఖాన్‌, మలయాళం నుండి దుల్కర్‌ సల్మాన్‌, తమిళం నుండి ధనుష్‌లు ఉత్తమ నటులుగా అవార్డులు అందుకోనున్నారు.

మరిన్ని వార్తలు

చరణ్‌కు గాయాలు.. ఎక్కడంటే?

నిహారిక తిక్క పని!!