ఎన్టీఆర్‌ మరో మల్టీస్టారర్‌ కన్ఫర్మ్‌

junior ntr another multistarrer movie update

Posted [relativedate] at [relativetime time_format=”H:i”]

ఎన్టీఆర్‌ వరుసగా చిత్రాలు చేసుకుంటూ వెళ్తున్నాడు. ‘జైలవకుశ’ చిత్రం తర్వాత కాస్త గ్యాప్‌ తీసుకున్న యంగ్‌టైగర్‌ ప్రస్తుతం త్రివిక్రమ్‌ దర్శకత్వంలో సినిమా చేస్తున్నాడు. ఆ సినిమా షూటింగ్‌ పూర్తి అవ్వడమే ఆలస్యం రాజమౌళి దర్శకత్వంలో ఒక భారీ చిత్రాన్ని చేసేందుకు సిద్దం అవుతున్నాడు. అరవింద సమేత చిత్రంలో న్యూ లుక్‌తో కనిపించబోతున్న ఎన్టీఆర్‌, రాజమౌళి చిత్రంలో ఎలా కనిపిస్తాడో అంటూ అంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. రామ్‌ చరణ్‌తో కలిసి నటించబోతున్న ఎన్టీఆర్‌ తాజాగా మరో సినిమాకు కూడా గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చినట్లుగా తెలుస్తోంది. భారీ అంచనాల నడుమ రూపొందబోతున్న మల్టీస్టారర్‌ చిత్రం పూర్తి అయిన వెంటనే మరో మల్టీస్టారర్‌కు ఎన్టీఆర్‌ గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చేశాడు.

జక్కన్న దర్శకత్వంలో సినిమా వచ్చే సంవత్సరం చివరి వరకు పూర్తి అయ్యే అవకాశం ఉంది. ఆ తర్వాత పవన్‌ సాదినేని దర్శకత్వంలో ఒక చిత్రాన్ని ఎన్టీఆర్‌ చేయబోతున్నాడు. ఆ సినిమాను కళ్యాణ్‌ రామ్‌ నిర్మిస్తాడని ఇప్పటికే తేలిపోయింది. ఇక ఆ చిత్రంలో కళ్యాణ్‌ రామ్‌ ఒక కీలక పాత్ర పోషిస్తాడనే టాక్‌ వినిపిస్తుంది. తాజాగా కళ్యాణ్‌ రామ్‌ నటించిన ‘నా నువ్వే’ చిత్రం విడుదల అయ్యింది. ఆ సినిమా ప్రమోషన్‌లో భాగంగా కళ్యాణ్‌ రామ్‌ మీడియాతో మాట్లాడుతూ ఎన్టీఆర్‌తో త్వరలో ఒక సినిమా నిర్మించబోతున్నట్లుగా చెప్పుకొచ్చాడు. అదే సమయంలో అదో మల్టీస్టారర్‌ అని, అందులో తాను కూడా ఉంటాను అన్నట్లుగా హింట్‌ ఇచ్చాడు. పవన్‌ సాదినేని ప్రస్తుతం స్క్రిప్ట్‌ను సిద్దం చేస్తున్నాడు. ప్రస్తుతం ఎన్టీఆర్‌ దృష్టి అంతా కూడా త్రివిక్రమ్‌ మూవీపైనే ఉంది. ఆ తర్వాత జక్కన్న మల్టీస్టారర్‌పై పెట్టబోతున్నాడు. 2020లో అన్న కళ్యాణ్‌ రామ్‌తో కలిసి ఎన్టీఆర్‌ మల్టీస్టారర్‌తో ప్రేక్షకుల ముందుకు వస్తాడేమో చూడాలి.