మళ్లీ నిరాశ పర్చిన ‘జై లవకుశ’

Junior Ntr jai lava kusa audio launch in shilpakala vedika

Posted [relativedate] at [relativetime time_format=”H:i”]

యంగ్‌ టైగర్‌ ఎన్టీఆర్‌ హీరోగా బాబీ దర్శకత్వంలో తెరకెక్కిన ‘జై లవకుశ’ చిత్రం ఆడియో ఇటీవలే ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఎప్పుడైన ఎన్టీఆర్‌ సినిమా అంటే ఆడియో అంగరంగ వైభవంగా జరుగుతుంది. కాని ఈ సినిమా ఆడియో మాత్రం మీడియా సమావేశం ఏర్పాటు చేసి విడుదల చేయడం జరిగింది. ఫ్యాన్స్‌ను ఎవరిని పిలిచింది లేదు. కొన్ని భద్రత కారణాల వల్ల ఆడియో విడుదల వేడుకను జరపడం లేదు అంటూ నిర్మాత కళ్యాణ్‌ రామ్‌ ప్రకటించాడు. ఆడియో విడుదల కార్యక్రమం లేకున్నా కూడా ప్రీ రిలీజ్‌ వేడుకను వైభవంగా నిర్వహిస్తామని కళ్యాణ్‌ రామ్‌ హామీ ఇచ్చాడు. హామీ మేరకు ‘జై లవకుశ’ ప్రీ రిలీజ్‌ వేడుకకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. 

ఎన్టీఆర్‌ సినిమా అనగానే అంచనాలు ఆకాశాన్ని తాకేలా వస్తాయి. అంచనాలకు తగ్గట్లుగా సినిమా ఉంటుందనే నమ్మకం ప్రేక్షకుల్లో ఉంది. ఇక ఎన్టీఆర్‌ ఏ వేడుకలో పాల్గొన్నా కూడా ఫ్యాన్స్‌ భారీగా హాజరు అవుతారు. అందుకే ఎన్టీఆర్‌ ఏ సినిమా వేడుక అయినా కూడా పెద్ద వేదికల్లో నిర్వహిస్తారు. కాని ‘జై లవకుశ’ ఆడియో మాత్రం శిల్పకళవేదికలో నిర్వహించాలని భావిస్తున్నారు. ఫంక్షన్‌కు హాజరు అవ్వాలని భావిస్తున్న అభిమానుల్లో కేవలం సగం మంది కూడా శిల్పకళ వేదికలో పట్టరు. అందుకే ఎన్టీఆర్‌ అభిమానులు నిరాశను వ్యక్తం చేస్తున్నారు. నందమూరి ఫ్యాన్స్‌ ప్రస్తుతం ఇలాంటి చెత్త నిర్ణయాన్ని తీసుకున్నందుకు గాను కళ్యాణ్‌ రామ్‌పై తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.